టాలీవుడ్ లో డాషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ ‘టెంపర్ ’ సినిమా తర్వాత వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు.  దాంతో ఈసారి ఎలాగైన మంచి హిట్ కొట్టాలనే కసితో తీసిన సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’.  ఈ మూవీతో కొంత కాలంగా వరుస పరాజయాలతో కష్టాల్లో పడ్డ రామ్ పోతినేని కూడా మంచి విజయం అందుకున్నాడు.  ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ షేక్ చేస్తుంది.  


అయితే చాలా కాలం తర్వాత సూపర్ హిట్ అందుకున్న పూరి జగన్నాథ్ ఇంత మంచి విజయాన్ని తనకు అందించిన ప్రేక్షక దేవుళ్లకు ధన్యవాదాలు తెలుపుతూ సక్సెస్ టూర్ కొనసాగిస్తున్నారు.  ఇప్పుడాయన తన టీమ్ తో సంబరాలు చేసుకుంటూ, సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద అభిమానులతో కలిసి సందడి చేస్తున్నాడు. ఆయన వెంట సినిమా సహ నిర్మాత చార్మీ సహా చిత్ర యూనిట్ కూడా పర్యటిస్తోంది. 


తాజాగా పూరి వీరాభిమానిని చూసిన ఛార్మీ తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయని ట్విట్ చేసింది. ఇటీవల పూరీ జగన్నాథ్ టీమ్, హన్మకొండకు వచ్చిన వేళ, పూరీకి స్వీట్ షాక్ ఇచ్చాడో వీరాభిమాని. తన హృదయంపై పూరీ జగన్నాథ్ బొమ్మనే పచ్చబొట్టు పొడిపించుకున్న ప్రభాకర్, దాన్ని కారులో కూర్చున్న పూరీకి చూపించాడు.

పక్కనే ఉన్న ఛార్మీ ఒక్కసారే షాక్ అయ్యింది..నిజంగా ఇంత అభిమానమా అంటూ సంతోషంలో మునిగిపోయింది. అంతే కాదు "ఓ డైహార్డ్ ఫ్యాన్ ప్రభాకర్ ఒంటిపై పూరీ జగన్ టాటూ. థ్యాంక్యూ సో మచ్. నువ్వు నా హృదయాన్ని టచ్ చేశావు" అని క్యాప్షన్ పెట్టింది.  ఇస్మార్ట్ శంకర్ తో విజయం అందుకున్న పూరి జగన్నాథ్ తన తదుపరి సినిమా కన్నడ రాక్ స్టార్ యష్ తో తీయాలనే ప్లాన్ లో ఉన్నట్లు సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: