మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించిన కొరటాల శివ తరువాత సినిమా మెగాస్టార్ చిరంజీవితో తీయబోతున్నాడు. రాజకీయాల్లో బిజీగా ఉండటం వలన పదేళ్ళపాటు సినిమాలకు దూరమైన చిరంజీవి రామ్ చరణ్ బ్రూస్ లీ సినిమాలో స్పెషల్ పాత్రలో రీ ఎంట్రీ ఇచ్చి ఖైదీ నెంబర్ 150 సినిమాలో ఫుల్ లెంగ్త్ పాత్రలో హీరోగా నటించాడు..ప్రస్తుతం చిరంజీవి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా నరసింహా రెడ్డి సినిమాలో నటిస్తున్నాడు. 
 
అక్టోబర్ 2 వ తేదీన సైరా నరసింహా రెడ్డి విడుదల కాబోతుంది. సైరా నరసింహారెడ్డి విడుదలైన తరువాత కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటించబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కానప్పటికీ ఈ సినిమా కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి డ్యూయెల్ రోల్ చేస్తున్నాడని సమాచారం. నక్సలిజంకు సంబంధించిన కథతో కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది. 
 
ఈ సినిమాలో ఒక పాత్రలో చిరంజీవి నక్సలైట్ గా, మధ్య వయస్కుడిగా, నెరిసిన జుట్టుతో కనిపించబోతున్నాడని మరో పాత్రలో మాత్రం చిరంజీవి సాధారణంగానే కనిపిస్తాడని తెలుస్తోంది. చిరంజీవికి డ్యూయెల్ రోల్ సినిమాలు కొత్తేం కాదు. ముగ్గురు మొనగాళ్ళు సినిమాలో చిరంజీవి మూడు పాత్రల్లో కూడా నటించి మెప్పించాడు. 
 
చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నెంబర్ 150 కూడా డ్యూయెల్ రోల్ కథాంశంతో రూపొందినదే. ప్రస్తుతం కొరటాల శివ చిరంజీవితో తీయబోయే 152 వ సినిమా కథ, కథానాలు అన్నీ తయారు చేసాడట. ఒక పాత్రకు హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా మరో పాత్రకు హీరోయిన్ ఫైనల్ అవ్వాల్సి ఉంది. ఈ సినిమాలోని పాత్ర కోసం చిరంజీవి బరువు తగ్గాడని తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: