ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్ ప్రకటించింది ఇస్మార్ట్ శంకర్ టీం. రామ్ తో కలిసి ఇస్మార్ట్ శంకర్ సినిమాను చూడాలనుకునేవాళ్ల రేపు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లో ఉన్న ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సుదర్శన్ థియేటర్ కి వెళ్ళండి. ఎందుకంటే రేపు అక్కడికి రామ్ వస్తున్నాడు. ఫ్యాన్స్ తో కలిసి రేపు ఆయన సుదర్శన్ థియేటర్ లో ఫస్ట్ షో కి ఇస్మార్ట్ శంకర్ వీక్షించనున్నాడు.
ఇక ఈ సినిమా బ్లాక్ బ్లాస్టర్ విజయం సాధించడంతో సినిమా యూనిట్ ఫుల్ జోష్ లో ఉంది. అందులో భాగంగా సక్సెస్ టూర్ లను నిర్వహిస్తున్నారు. అయితే ఇస్మార్ట్ శంకర్ జోరు కు విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ బ్రేక్ వేస్తుందని అనుకున్నారు కాని అనూహ్యంగా ఆ సినిమా మినిమమ్ పోటీ కూడా ఇవ్వలేకపోవడంతో బాక్సాఫిస్ వద్ద ఇస్మార్ట్ శంకర్ కు ఎదురులేకుండా పోయింది. దాంతో రెండు వారాలవుతున్న ఈ చిత్రం ఇప్పటికి మంచి వసూళ్లను రాబడుతుంది.
ఇక విడుదలైన మూడో రోజే ఈ చిత్రం దాదాపుగా అన్ని ఏరియాల్లో బేక్ ఈవెన్ కాగా నిన్నటి వరకు 33కోట్ల షేర్ ను రాబట్టిందని సమాచారం. వరుస డిజాస్టర్ లతో డీలా పడ్డ పూరి జగన్నాథ్ కు ఈ చిత్రం కొత్త ఉత్సహాన్ని ఇవ్వగా కెరీర్ లో ఎప్పటినుండో బ్లాక్ బ్లాస్టర్ విజయం కోసం ఎదురుచూసిన రామ్ కోరిక ను కూడా తీర్చింది. పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో నాబా నటేష్ , నిధి అగర్వాల్ కథానాయికలుగా నటించారు. అయితే రేపు రాక్షసుడు , గుణ 369 చిత్రాలు విడుదలవుతున్నాయి మరి ఆ సినిమాలైన ఇస్మార్ట్ శంకర్ కు పోటీనిస్తాయో లేదో చూడాలి.