బుల్లి తెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న రియాలిటీ షోస్ లో ఒకటి "బిగ్ బాస్-3". ఈ షో కి అక్కినేని నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారు.ఈ షోలో 15 మంది కంటిస్టెంట్స్ ఉన్నారు,వారిలో మొదటి వారంలో నటి హేమ బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోయారు,తరువాత షో లోకి తమన్నా సింహాద్రీ కొత్తగా ఎంట్రీ ఇచ్చారు.ఇపుడు ఈ షో ఎంతో హుషారుగా,గొడవలతో,అల్లర్లతో సాగిపోతుంది.


ఇది ఇలా ఉండగా అక్కినేని నాగార్జున రీసెంట్గా  థియేటర్లలోకి రానున్న చిత్రం "మన్మదుడు 2 ".ఈ చిత్రం లో నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించారు.ఈ చిత్రం  9 ఆగస్టు 2019 న మన ప్రేక్షకుల ముందుకు రానుంది.



ఇపుడు రకుల్ తన చిత్రం విడుదల సందర్బంగా బిగ్ బాస్3 లోకి గెస్ట్ గా హౌస్లో కి రావటమే కాకుండా బిగ్ బాస్ హౌస్ లోని కంటిస్టెంట్ట్స్ తో కలిసి తన సినిమా గురించి మాట్లాడుకుంటూ పోటీదారులతో కూడా ఆమె ఇంటరాక్ట్ అవుతారని అంటున్నారు.బిగ్ బాస్-౩ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఫస్ట్  సెలెబ్రిటి మన రకుల్.మన్మదుడు 2 కి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు మరియు అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని బ్యాంక్ రోల్ చేస్తున్నారు. సమంతా అక్కినేని, కీర్తి సురేష్ కూడా ఈ చిత్రంలో భాగం మరియు అతిథి పాత్రలో కనిపించనున్నారు.



నాగార్జునా కెరీర్ లో ఒక పెద్ద హిట్ గా నిలిచిన చిత్రం "మన్మదుడు" 2002 లో రిలీజ్ అయింది, ఈ చిత్రానికి  త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్సకత్వం వహించారు. దీంట్లో మన కింగ్ నాగార్జునా గారు లీడ్ రోల్ చేసారు.రాబోయే చిత్రం మన్మదుడు 2 సీక్వెల్ కాదని ఆయన అన్నారు. కానీ వారు మన్మదుడు టైటిల్‌తో వెళ్లాలని ఎంచుకున్నారు. ఎందుకంటే ఇది కళా ప్రక్రియలో ఖచ్చితంగా సరిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: