టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ ఉన్న హీరోల్లో అల్లు అర్జున్ కి ప్రత్యేక స్థానం ఉంది. ఎంతో పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఫ్యామిలీ నుంచి వచ్చినా తనకంటూ ఓన్ స్టైల్ క్రియేట్ చేసుకుని స్టార్ హీరో అయ్యాడు. ఇండస్ట్రీలో బన్నీగా పిలుచుకునే ఈ మెగా హీరోకి ఫ్యాన్స్ కూడా భారీ లెవల్లో ఉన్నారు. బన్నీ  కొత్త సినిమా స్టార్ట్ అయిందంటే ఇండస్ట్రీలో, ఫ్యాన్స్ లో కూడా బజ్ క్రియేట్ అవుతుంది.

 

ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో AA19 అనే టినెటివ్ టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. పూజా హెగ్డే, నివేధా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా తరువాత బన్నీ నటించబోయే సినిమా దాదాపు కన్ఫర్మ్ అయిందనేది లేటెస్ట్ అప్డేట్. స్టార్ డైరక్టర్ సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటించే సినిమాకు ఈ ఆగష్టులోనే కొబ్బరికాయ కొట్టనున్నారు. రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభం కానుందని సమాచారం. యూత్ లేటెస్ట్ హార్ట్ త్రోబ్ కన్నడ బ్యూటీ రష్మిక మందన బన్నీతో ఆడిపాడనుంది. ఎర్ర చందనం మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. మైత్రీ మూవీస్ నిర్మించే ఈ సినిమాకు సంగీతం దేవీశ్రీ ప్రసాద్ అందించనున్నాడు. గతేడాది రంగస్థలంతో భారీ ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన సుకుమార్ మళ్లీ మెగాఫోన్ పట్టనున్నాడు.

 

త్రివిక్రమ్ తో బన్నీ సినిమా ప్రస్తుతం కాకినాడలో జరుగుతోంది. ఫైట్ తో పాటు కొన్ని యాక్షన్ సీన్లు ఇక్కడ షూట్ చేయనున్నారు. ఈ సినిమా, సుకుమార్ సినిమాతో పాటు దిల్ రాజు బ్యానర్ లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో సినిమాను కూడా బన్నీ ఓకే చేశాడు. ఆ సినిమాకు ఐకాన్ అనే టైటిల్ అనుకుంటున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: