ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో హిరోయిన్లు లేదా మరే ఇతర పాత్రలు చేసినా అమ్మాయిల అందాలను కెమెరాలో బాగా బందిస్తున్నారు. తాజాగా విడుదలైన ఆమె సినిమా మంచి రెస్ప్సాన్స్ అందుకుంటుంది. అయితే ఈ చిత్రంపై తెలుగ నటి బిందు మాధవి తాజాగా ప్రకటన చేసింది.ఇప్పుడు అది తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిగ్ మారింది.

తెలుగు చిత్ర పరిశ్రమలో 'బంపర్ ఆఫర్'.. 'రామ రామ కృష్ణ కృష్ణ'.. 'పిల్ల జమిందార్' సినిమాలలో హీరోయిన్ గా నటించింది బిందు మాధవి. అయితే ఆ తర్వాత  ఈ భామకు  తర్వాత తమిళంలో అవకాశాలు రావడంతో కోలీవుడ్ కు షిఫ్ట్ అయిపోయింది.  అక్కడ 'కళుగు'.. 'కేడి బిల్లా కిలాడి రంగా'.. 'దేసింగు రాజా'.. 'వాలిబార్ సంగం' లాంటి చాలా తమిళ సినిమాల్లో నటించింది. తాజాగా 'కళుగు 2' తో అనే తమిళ సినిమాలో నటించింది.  ఈ సినిమా ఆగష్టు 2 న రిలీజ్ అవుతోంది.  ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా బిందు మాధవి సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఈమధ్య 'అడై'(తెలుగులో 'ఆమె') సినిమాలో అమలా పాల్ నగ్నంగా నటించి అందరికీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.  'ఆమె' సినిమాలో అమలా నటనకు.. న్యూడ్ సీన్ కు ప్రేక్షకుల నుండే కాకుండా.. విమర్శకుల నుండి ప్రశంసలు లభించాయి. ఈ విషయం బిందు మాధవితో ప్రస్తావిస్తే.. ఆ సినిమాను చూశానని.. అమలా పాల్ నటన అద్భుతమని ప్రశంసించింది.  తనకు అలాంటి సినిమాలలో నటించాలని ఉందని.. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే నేను కూడా నగ్నంగా నటించేందుకు సిద్ధమని వెల్లడించింది.

"న్యూడ్ గా నటించేందుకు సిద్ధం" అంటూ బిందుమాధవి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.  అమలా పాల్ పాల్ నగ్నంగా నటించడంపై మొదట్లో కొందరు సంప్రదాయవాదులు విమర్శించినా.. సినిమా విడుదలైన తర్వాత మాత్రం కథకు తగ్గట్టు నటించిందని.. అసభ్యత లేదని అమలను చాలామంది మెచ్చుకున్నారు. అమలాకు ఈ రకంగా యాక్సెప్టెన్స్ రావడంతో బిందు మాధవి లాంటి ఇతర హీరోయిన్లకు కూడా ధైర్యం వచ్చినట్టుంది.  ఇలా హీరోయిన్లు నగ్నంగా నటించేందుకు ఒకరి తర్వాత ఒకరు ముందుకు వస్తూ ఉంటే త్వరలో ఈ నగ్నత్వం ట్రెండు టాలీవుడ్ కు పాకడం ఖాయమే!

మరింత సమాచారం తెలుసుకోండి: