పవన్ కళ్యాణ్ ఎంపీగా ప్రముఖ రచయిత కాబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ రాజకీయాల్లోకి వస్తున్నాడు అన్న వదంతులు వెలుబడడం, ఆ వార్తలన్నీ అవాస్తవాలని సోదరుడు నాగబాబు కొట్టిపారేయడం అందరికి తెలిసిందే. కాని ఈ వ్యవహారం అంతటికి కేంద్రబింధువైన పవన్ మాత్రం ఇప్పటికి నోరు విప్పలేదు. అయితే ఆయన తరఫున ఓ ప్రముఖ రచయిత ఈ భాద్యత తీసుకున్నాడు అంటున్నారు టాలీవుడ్ లో. ఆయన ఎవరో కాదు పవన్ కు ఎన్నో ఏళ్లుగా సన్నిహితంగా ఉంటున్న సినిమా రచయిత కూన వెంకట్ అట. వెంకట్ ఇక నుంచి పవన్ తరఫున ఎంపీ (మౌత్ పీస్) గా బాద్యతలు తీసుకున్నాడు అంటున్నారు. ఇందులో భాగంగానే పవన్ రాజకీయాల్లోకి వస్తున్నాడు అన్న వార్తలు ఎవరు నమ్మొద్దు, అవన్నీ ఆధారాలు లేని వార్తలు అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నాడు కూన వెంకట్ అంటున్నారు. అత్తారింటికి దారేది సినిమా ఫంక్షన్ లో పవన్ మాట్లాడడం, వాటిని మీడియా ఎన్నో రకాలుగా అభివర్ణించి ఏవోవో రాసి పవన్ ను ఇరుకున పెట్టిన విషయం తెలిసిందే. పవన్ సినిమా పైరసీ వెనుక అబ్బాయి అంటే రాంచరణ్ అని, సినీ ప్రముఖుడు అంటే అల్లు అరవింద్ అని ఏవేవో ఊహాగానాలు రాసి పవన్ ను ఇరకాటంలో పడేసారు. అందుకే ఇక నుంచి తన వాయిస్ ను వినిపించేందుకు కూన వెంకట్ ను పెట్టుకున్నాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: