గుణ్ణం గంగరాజు ఈ పేరు తెలిసిన వాళ్ళూ చాలా తక్కువ మందే ఉండచ్చు. కానీ ఆయన తీసిన " అమృతం" సీరియల్ ఎంత పాపులరో చెప్పక్కర్లేదు. లిటిల్ సోల్జర్స్ ,అనుకోకుండా ఒకరోజు వంటి థ్రిల్లర్ చిత్రాలను తీసిన గుణ్ణం గంగరాజు "అమృతం చందమామలో " చిత్రం  తర్వాత ఆయన సినిమాలకి దూరంగా ఉన్నాడు. అయితే తన కుమారుడు అశ్విన్ గంగరాజును దర్శకుడిగా పరిచయం చేస్తూ రాజమౌళి కొడుకు కార్తికేయ ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.


ఆ సినిమా పేరు"ఆకాశవాణి". కార్తికేయ తన సొంతంగా నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. కార్తికేయ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రాజమౌళి, కీరవాణి, గంగరాజు ఇలా కుటుంబ పెద్దలందరూ  పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. అయితే షూటింగ్ అంతా పూర్తయ్యాక కొన్ని పొరపాట్లను గమనించిన రాజమౌళి కొన్ని సీన్లని రీషూట్ చేయించాడని టాక్.


ఆకాశవాణి’లో విలన్ పాత్ర అత్యంత కీలకమట. కథంతా దాని చుట్టూనే తిరుగుతుందట. ఐతే ఈ పాత్రకు ఒక కొత్త నటుడిని పెట్టుకున్నారట. అతను ఆ పాత్రను హోల్డ్ చేయలేకపోయాడట. స్టేచర్ ఉన్న నటుడు చేయాల్సిన పాత్ర కావడంతో అది పండదని రాజమౌళి అండ్ కో ఫీలైందట. దీంతో  ఇంటెన్సిటీ దెబ్బ తింటుందని భావించి ఆ పాత్రను వేరే నటుడితో చేయించి మళ్లీ సన్నివేశాలన్నీ రీషూట్ చేయించినట్లుగా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 


ఈ పాటికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉండాల్సిన సినిమా..రీషూట్ వల్లే  ఆలస్యమైందట. సెప్టెంబరులో ‘ఆకాశవాణి’ ప్రేక్షకుల ముందుకు రావచ్చని సమాచారం. ఆగస్టులో ట్రైలర్ ని విడుదల చేసే పనిలో ఉన్నారట. ఈ చిత్రంలో లీడ్ రోల్స్‌లో కొత్తవాళ్లు చేస్తున్నారు. మరి అన్ని జాగ్రత్తలు తీసుకుని చేసిన ఈ చిత్రం ప్రేక్షకులని ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.





మరింత సమాచారం తెలుసుకోండి: