దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కుటుంబానికి సంబంధించిన ఒక ఆసక్తికరమయిన వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన  రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడి , రచయిత కనిక ధిల్లాన్ 2014లో ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెల్సిందే . అయితే వీరిద్దరి వైవాహిక జీవితం లో మనస్పర్థలు వచ్చి  రెండేళ్ల క్రితమే విడిపోయినట్లు కనిక వెల్లడించింది . తాజాగా వీరిద్దరు కలిసి బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటించిన జడ్జి మెంటల్ హై క్యా సినిమాకు పని చేశారు .


 ప్రకాష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కనిక రచయిత గా కథ అందించింది . ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా కనిక తనని  కలిసిన మీడియాతో మాట్లాడుతూ ప్రకాష్ తో తన వైవాహిక జీవితం గురించి చెప్పుకొచ్చింది.  తామిద్దరం రెండేళ్ల క్రితమే పరస్పర అంగీకారంతో విడిపోయినట్లు చెప్పింది ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు రావడం వల్లే, కలిసి ఉండడం ఇష్టం లేక  రెండేళ్ల క్రితం విడిపోయామని అంది . అయినా  స్నేహితుల మాదిరిగా కలిసి  కలిసి ఉంటున్నామని కనిక చెప్పుకొచ్చింది . వీరిద్దరూ  కలిసి పలు బాలీవుడ్ చిత్రాలకు పనిచేశారు.


 తెలుగులోనూ ప్రకాష్ పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు . టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రకాష్ తొలిచిత్రం డిజాస్టర్ గా మిగలడం తో మరొకసారి నటన వైపు అడుగులు వేయకుండా , తనకిష్టమైన దర్శకత్వ శాఖ లో ప్రతిభ చాటుకునే ప్రయత్నాన్ని చేశారు . టాలీవుడ్ లో పలు చిత్రాలకు దర్శకత్వం వహించినప్పటికీ , ప్రకాష్ కు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలేవీ లేకపోవడం తో ఆయన కెరీర్ తండ్రి మాదిరిగా ఉన్నత శిఖరాలకు చేరుకోలేకపోయింది .


మరింత సమాచారం తెలుసుకోండి: