యువ హీరో  బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన లేటెస్ట్ మూవీ  'రాక్షసుడు'  మంచి అంచనాల మధ్య నిన్న విడుదలై  సూపర్ పాజిటివ్ రివ్యూస్ ను రాబట్టుకుంది.  వాటికీ తోడు  మౌత్ టాక్  కూడా బాగుండడంతో  ఈ చిత్రం  మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో  2 కోట్ల షేర్  ను రాబట్టిందని సమాచారం.  అయితే ప్రస్తుతం  గత కొద్దీ రోజులనుండి తెలుగు రాష్ట్రాల్లో  ఎడతెరిపి లేకుండా వర్షాలు  కురుస్తుడడం తో ఆ ప్రభావం  ఈ సినిమా కలెక్షన్స్ ఫై పడింది.  దాంతో ఈచిత్రం డీసెంట్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది. లేదంటే బెల్లంకొండ కెరీర్ లో ఈ చిత్రం హైయెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టేదే.   కాగా ఓవర్సీస్ లో  కూడా ఈచిత్రం మంచి వసూళ్లనే రాబడుతుంది.   

గత  ఏడాది కోలీవుడ్ లో విడుదలై బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సాధించిన  సైకో థ్రిల్లర్  మూవీ 'రాక్షసన్'  రీమేక్  గా తెరకెక్కిన  ఈ చిత్రంలో  అనుపమా పరమేశ్వరన్ కథానాయికగా  నటించగా 'రైడ్' ఫేమ్ రమేష్ వర్మ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు.  ఎక్కడ మార్పులు  చేయకుండా సీన్ టు సీన్ ను రీమేక్ చేసుకుంటూ వెళ్ళాడు.   

 గిబ్రాన్ సంగీతం అందించిన  ఈ చిత్రాన్ని సత్యనారాయణ కోనేరు , హవీష్ లక్ష్మణ్ కోనేరు నిర్మించారు.  అభిషేక్ పిక్చర్స్ ఈ సినిమా ను ప్రపంచ వ్యాప్తంగా విడుదలచేసింది.  ఇక వరుస పరాజయాల తరువాత  ఈ రాక్షసుడు చిత్రంతో  కెరీర్ లో తొలి సారి సాలిడ్ గా హిట్ కొట్టబోతున్నాడు  సాయి శ్రీనివాస్.  ఇక ఈ చిత్రం తరువాత సాయి ఇంతవరకు  మరో చిత్రానికి సైన్ చేయలేదు.  అయితే ఈసారి మీడియం రేంజ్ డైరెక్టర్ తో కాకుండా స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయాలని ఆయన బావిస్తున్నాడట. 

మరింత సమాచారం తెలుసుకోండి: