గత ఏడాది కోలీవుడ్ లో విడుదలై బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సాధించిన సైకో థ్రిల్లర్ మూవీ 'రాక్షసన్' రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ కథానాయికగా నటించగా 'రైడ్' ఫేమ్ రమేష్ వర్మ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. ఎక్కడ మార్పులు చేయకుండా సీన్ టు సీన్ ను రీమేక్ చేసుకుంటూ వెళ్ళాడు.
గిబ్రాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సత్యనారాయణ కోనేరు , హవీష్ లక్ష్మణ్ కోనేరు నిర్మించారు. అభిషేక్ పిక్చర్స్ ఈ సినిమా ను ప్రపంచ వ్యాప్తంగా విడుదలచేసింది. ఇక వరుస పరాజయాల తరువాత ఈ రాక్షసుడు చిత్రంతో కెరీర్ లో తొలి సారి సాలిడ్ గా హిట్ కొట్టబోతున్నాడు సాయి శ్రీనివాస్. ఇక ఈ చిత్రం తరువాత సాయి ఇంతవరకు మరో చిత్రానికి సైన్ చేయలేదు. అయితే ఈసారి మీడియం రేంజ్ డైరెక్టర్ తో కాకుండా స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయాలని ఆయన బావిస్తున్నాడట.