తెలుగు లో పెళ్లిచూపులు సినిమాతో మంచి విజయం అందుకున్న విజయ్ దేవరకొంత తర్వాత వంగ సందీప్ దర్శకత్వంలో నటించిన ‘అర్జున్ రెడ్డి’ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీ తో విజయ్ దేవరకొండకు ఒక్కసారే యూత్ లో మంచి క్రేజ్ వచ్చింది. అర్జున్ రెడ్డి మూవీ బోల్డ్ కంటెంట్ గా ఉన్నప్పటికీ అందులో హృదయాలను కదిలించే ప్రేమ ఉండటంతో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ఈ మూవీ హిందీలో సందీప్ వంగా దర్శకత్వం చేయగా షాహిద్ కపూర్ హీరోగా నటించారు. షాలినీ పాండే పాత్రలో కైరా అద్వాని నటించింది.
హిందీలో 300 కోట్లకు పైగా వసూళ్లను దక్కించుకున్న కబీర్ సింగ్ ఈ ఏడాది టాప్ చిత్రాల జాబితాలో నిలిచింది. రికార్డుల మోత మ్రోగించిన కబీర్ సింగ్తో మన తెలుగు సినిమా సత్తా అక్కడ తెలిసింది. అయితే ఈ మూవీ తమిళ్ లో స్టార్ హీరో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా ఆధిత్య వర్మగా రీమేక్ చేశారు. ఈ మూవీ దాదాపు పూర్తయి ప్రొడక్షన్ కి వెళ్తున్న సమయంలో నిర్మాతల అసంతృప్తితో పూర్తిగా రీ షూట్ చేశారట. అంతేకాదు ఈ మూవీ వీక్షించిన ధృవ్ తండ్రి విక్రయ్ కూడా అసహనం వ్యక్తం చేయడంతో ఈ మార్పులు చేసినట్లు ఆ మద్య వార్తలు వచ్చాయి.
ప్రస్తుతం తెలుగులో అర్జున్ రెడ్డికి సహ దర్శకుడిగా ఉన్న గిరీశయ్య ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. వాస్తవానికి ఈ మూవీ జూలైలోనే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించిందట. కానీ అప్పటికే హిందీలో కబీర్ సింగ్ హల్ చల్ మొదలు కావడంతో ఇది సమయం కాదని పోస్ట్ పోన్ చేశారట. 50 రోజులు పూర్తి చేసుకున్న కబీర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద నుండి పూర్తిగా తప్పుకున్నాడు. ఇప్పుడు తమిళ్ లో ఆధిత్య వర్మ మూవీ రిలీజ్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నారట చిత్ర యూనిట్. ఈ మూవీతో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా పరిచయం కాబోతున్న విషయం తెల్సిందే.