మాస్ రాజా రవితేజ , శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన 'వెంకీ' ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలోని ట్రైన్ ఎపిసోడ్ కామెడీ లో సరి కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది . ఇప్పటికి ఈ ఎపిసోడ్ ను చూస్తూ ఉంటారంటే దీనికి ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇలాంటి హిలేరియస్ ట్రైన్ ఎపిసోడ్ ను ఇప్పుడు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రీ క్రియేట్ చేస్తున్నాడు.
ఈ ఏడాది సంక్రాంతి కి 'ఎఫ్ 2' తో బ్లాక్ బ్లాస్టర్ హిట్ కొట్టిన అనిల్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తో 'సరిలేరునికెవ్వరు' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రం కాశ్మీర్ లో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం రెండవ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో ట్రైన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు. ఇది చాలా హిలేరియస్ గా వుండనుందని సమాచారం. ఈ ఎపిసోడ్ సినిమాలో హైలైట్ కానుందట.
పక్క కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనుండగా ఆయనకు జోడిగా కన్నడ బ్యూటీ రష్మిక మందన్న నటిస్తుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో ఏకే ఎంటర్ టైమెంట్స్ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్,జిఏంబి ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదలకానుంది. కాగా ఈచిత్రం ఫై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక భరత్ అనే నేను , మహర్షి సినిమాలతో వరుసగా బ్లాక్ బాస్టర్ హిట్లు కొట్టిన మహేష్ ఈ సరిలేరునికెవ్వరుతో హ్యాట్రిక్ కొడతాడో లేదో చూడాలి.