మాస్ రాజా రవితేజ , శ్రీను వైట్ల  కాంబినేషన్ లో వచ్చిన  'వెంకీ' ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ముఖ్యంగా ఈ  సినిమాలోని  ట్రైన్ ఎపిసోడ్ కామెడీ లో సరి కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది .  ఇప్పటికి  ఈ ఎపిసోడ్ ను చూస్తూ ఉంటారంటే దీనికి ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు.  ఇలాంటి హిలేరియస్  ట్రైన్ ఎపిసోడ్ ను  ఇప్పుడు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి  రీ క్రియేట్ చేస్తున్నాడు. 


 ఈ ఏడాది సంక్రాంతి కి 'ఎఫ్ 2' తో బ్లాక్ బ్లాస్టర్ హిట్ కొట్టిన అనిల్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తో 'సరిలేరునికెవ్వరు' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రం కాశ్మీర్ లో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం  రెండవ షెడ్యూల్  హైదరాబాద్ లో జరుగుతుంది.  ఈ షెడ్యూల్ లో ట్రైన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు. ఇది చాలా హిలేరియస్ గా వుండనుందని సమాచారం.  ఈ ఎపిసోడ్ సినిమాలో  హైలైట్ కానుందట. 


 పక్క కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరక్కుతున్న ఈ చిత్రంలో  మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనుండగా ఆయనకు జోడిగా  కన్నడ బ్యూటీ రష్మిక మందన్న నటిస్తుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో ఏకే ఎంటర్ టైమెంట్స్ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్,జిఏంబి ఎంటర్ టైన్మెంట్స్  సంయుక్తంగా  నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదలకానుంది.  కాగా ఈచిత్రం ఫై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక భరత్ అనే నేను , మహర్షి  సినిమాలతో  వరుసగా బ్లాక్ బాస్టర్ హిట్లు కొట్టిన  మహేష్  ఈ సరిలేరునికెవ్వరుతో హ్యాట్రిక్  కొడతాడో లేదో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: