పాపులర్ వెస్టీండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావోతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సోషల్ అవేర్నేస్ ఫిల్మ్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కేవలం ఎంటర్టైన్మెంట్ సినిమాలనే కాకుండా అన్ని రకాల జోనర్స్లో విభిన్నమైన సినిమాలను అందించాలనేదే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లక్ష్యం. అందుకే 'ఎం.ఎల్.ఎ, వైఫ్ ఆఫ్ రామ్, గూఢచారి, ఓ..బేబి..' వంటి వైవిధ్యమైన, విజయవంతమైన సినిమాలను నిర్మించి అతికొద్ది కాలంలోనే అభిరుచి గల నిర్మాణ సంస్థగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య తో భారీ మల్టీస్టారర్ 'వెంకీ మామ', అనుష్క ప్రధాన పాత్రలో 'నిశ్శబ్దం' అనే ఇంటర్నేషనల్ సినిమాని నిర్మిస్తుంది.
ఇక కేవలం వ్యాపార దృక్పథమే కాకుండా, సామాజిక స్పృహకు సంబంధించిన విషయాలలో కూడా ప్రజలలో అవగాహన కల్పించాలనే.. సోషల్ అవేర్నెస్ ఫిల్మ్స్ ను నిర్మిస్తున్నారు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల. ఈ నిర్మాణ సంస్థతో ఎ.ఎన్.టి ప్రొడక్షన్స్ సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా సోషల్ అవేర్నెస్ ఫిల్మ్ ను నిర్మిస్తున్నారు. ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR)’లో భాగంగా వెస్టీండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావోతో కలిసి ఈ సినిమాని నిర్మిస్తుండటం విశేషం. ఇక ఈ సినిమాకి ఆర్తి శ్రీవాత్సవ దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్తి శ్రీవాత్సవ దర్శకత్వం వహించిన ల్యాండ్ ఆఫ్ విడోస్, వైట్ నైట్.. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో అవార్డులు గెలుచుకున్నాయి.
ఇప్పుడు మహిళలకు శుభ్రత విషయంలో అవగాహన కల్పించేందుకుగాను ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఆర్తి శ్రీవాత్సవ, డ్వేన్ బ్రావోతో కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. జులైలో తమిళనాడులో షూటింగ్ జరగడంతో ఇండియాలో షూటింగ్ పూర్తయ్యింది. ఆగష్టులో వెస్టీండీస్ లోని ట్రినిడాడ్, టోబాగోలలో షూటింగ్ చేయనున్నారు. సామాజిక అంశంతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారిగా అంచనాలు మొదలయ్యాయి. మరి ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ ను క్రియోట్ చేస్తుందో చూడాలి.