బిగ్బాస్ రియాలిటీ షో గురించి తెలియని వారెవరూ లేరు. అన్ని భాషల్లోనూ అంతటా నడుస్తుంది ఈ షో దీనికి ఉన్న క్రేజ్ మరే షోకి లేదనే చెప్పాలి. ఇకపోతే తెలుగులో బిగ్ బాస్.. ఇదంతా ట్రాష్ అంటూ మొదటి నుంచి వివాదాల్లో నడుస్తుంది. మొదట ఎన్టీ ఆర్, రెండు.. నాని, మూడు నాగార్జున.. ముగ్గురు ఎన్ త్రయం తెలుగు తెరపై ఫామ్ లో ఉన్న హీరోలే బిగ్ బాస్ రియాల్టీ షో హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. నందమూరి, అక్కినేని కుటుంబాలకు తెలుగు సినీరంగంలో మాంచి గుర్తింపు ఉంది తెలుగు సినిమాకు ఆ రెండు కుటుంబాలు రెండు కళ్లు అనేంతగా పేరు ప్రఖ్యాతులున్నాయి. అటువంటి అక్కినేని నాగార్జున సారథ్యంలో బిగ్ బాస్ సీజన్ 3 మొదలైంది. ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా.. హౌస్ లో ఉండే వారి ఎంపిక సమయంలోనే చికాకులు మొదలయ్యాయి. జర్నలిస్టు శ్వేతారెడ్డి, నటి గుప్త ఇద్దరూ క్యాస్టింగ్ కౌచ్ బిగ్ బాస్ లోనూ ఉందంటూ ఆరోపణలు చేశారు.
కాగా తాజాగా నాగార్జునపై టీవీ యాంకర్ శ్వేతారెడ్డి తీవ్రంగా విరుచుకు పడింది. హైదరాబాద్ సోమాజీగూడలోని ప్రెస్ క్లబ్ లో ఆమె మాట్లాడుతూ, నాగార్జునకు సామాజిక బాధ్యత లేదని మండిపడ్డారు. నాగార్జున భార్య అమల జంతువుల సంరక్షణ కోసం స్పందిస్తున్నారని... బిగ్ బాస్ షోపై ఇంత మంది అమ్మాయిలు ఆరోపిస్తున్నా నాగార్జున ఎందుకు స్పందించడం లేదని దుయ్యబట్టారు. 'మన్మథుడు2' సినిమా ప్రమోషన్ కోసం ఆసక్తి చూపుతున్న నాగార్జున... తమ ఆరోపణలపై స్పందించకుండా మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. టాస్క్ ల పేరిట బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ లను మానసికంగా వేధిస్తున్నారని అన్నారు.
దమ్ముంటే అమల, సమంతలను బిగ్ బాస్ షోకు పంపించాలని శ్వేతారెడ్డి సవాల్ విసిరారు. వారిద్దరినీ బిగ్ బాస్ షోకు పంపి డబ్బులు సంపాదించుకోవాలని అన్నారు. నాగార్జున దొంగలా దాక్కుంటున్నారని... తప్పు చేయకపోతే బయటకు వచ్చి స్పందించాలని డిమాండ్ చేశారు. డబ్బుల కోసం ఏమైనా చేస్తావా నాగార్జునా? అని ప్రశ్నించారు. మీ ఇంట్లో కూడా ఆడవారు ఉన్నారు కదా అంటూ విమర్శలు గుప్పించారు. ఇకపోతే ఇంత ఘాటుగా స్పందించిన శ్వేతా రెడ్డి జర్నలిస్ట్ కమ్ యాంకర్. ఆవిడకి ఎటువంటి సంబంధం లేకపోయినా ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవ్వుద్దని అనవసరమైన విషయాల్లో కలగజేసుకుంటూ తనకు తాను పబ్లిసిటీ కోసం ఇలా చేస్తుందని కొందరు అభిప్రాయం.