టాలీవుడ్ లో వరుసగా తనదైన కామెడీ మార్క్ చాటుకుంటూ విజయాలు అందుకుంటున్నాడు దర్శకులు అనీల్ రావిపూడి.  ఇక వంశి పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు.  టాలీవుడ్ లో వరుస విజయాలు అందుకుంటున్న అనీల్ రావిపూడి ఒక కథతో మహేష్ బాబుని ఇంప్రెస్ చేయడం..వెంటనే ఆ మూవీకి ఒకే చెప్పేయడం, సెట్స్ పైకి వెళ్లడం సినిమా పేరు కూడా ఖరారు కావడం ఇలా చక చకా అయిపోయాయి. 

ఈ మూవీలో మరో ప్రత్యేకత ఏంటంటే చాలా కాలం తర్వాత విజయశాంతి నటిస్తుంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇటీవల కాశ్మీర్ లో జరిగింది.  తాజాగా రెండో షెడ్యూల్ మొదలైందని నిర్మాతలు తెలిపారు. ఈ షెడ్యూల్ సినిమాకు హైలెట్ గా నిలవబోతుందని ఫుల్ లెన్త్ కామెడీ ట్రాక్ తో ఉండబోతుందని దర్శకులు అనీల్ రావిపూడి తెలిపారు. ట్రైన్ ఎపిసోడ్ లోనే హీరోయిన్ రష్మికతో మహేష్ లవ్ స్టోరీ మొదలవుతుందని సమాచారం.  ఆయన కాశ్మీర్ నుండి కర్నూలులో ఉన్న తన ఇంటికి ప్రయాణిస్తుండగా.. రష్మిక, ఆమె కుటుంబంతో పరిచయం ఏర్పడుతుందని చెబుతున్నారు.

'లాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌.. రైలులో సంక్రాంతికి మిమ్మల్ని చేరుకోవడానికి వేగంగా వస్తోంది. అనిల్‌ రావిపూడితో కలిసి సూపర్‌స్టార్‌ తెరపై సందడి చేయబోతున్నారు. సిద్ధంగా ఉండండి' అని నిర్మాత అనిల్‌ సుంకర సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే గతంలో మహేష్ బాబు దూకుడు, ఆగడు లాంటి సినిమాలతో కడుపుబ్బా నవ్వించారు.  ఆ తర్వాత చాలా వరకు సోషల్ మెసేజ్ సినిమాల్లోనే నటించడం మొదలు పెట్టారు. 

శ్రీమంతుడు, భరత్ అనే నేను సీరియస్ వర్షన్ తో పాలు మెసేజ్ ఓరియెంటెడ్ గా సాగుతుంది.  దాంతో ఒకే మూసపద్దతిలో పోతే ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతారని భావించిన మహేష్ బాబు ఈసారి ఫుల్ లెన్త్ ఎంట్రటైన్ మెంట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని సమాచారం. విజయశాంతి, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, రాజేంద్రప్రసాద్ కీలకపాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఆగస్ట్ 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసే ఛాన్స్ ఉందంటూ ప్రచారం  జరుగుతోంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: