టాలీవుడ్లోకి స్పీడ్ గా దూసుకొచ్చి అంతే స్పీడ్ గా ఫేడ్ అవుతున్న హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్. కెరీర్ లో టాప్ హీరోలతో సినిమాలు చేసింది. కానీ ఉపయోగం లేదు. నాని, రాజ్ తరుణ్ తో చేసిన సినిమాలు హిట్ అయ్యాయి. వీరి చిన్న హీరోలు.. సినిమా హిట్టైన పెద్దగా పేరు రాలేదు. వీరితో పాటు పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా చేసింది. పవన్ సినిమా హిట్టయినట్టైతే.. అను కెరీర్ మరోలా ఉండేది. కానీ పాపం కాలం కలిసి రాలేదు.
సినిమా ఘోరంగా పోయింది. ఇందులో నటించిన అనుకు పెద్దగా కలిసిరాలేదు. ఇదే సినిమాలో నటించిన మరో హీరోయిన్ కీర్తి సురేష్ కు మాత్రం ఈ సినిమా హిట్ కాకపోయినా.. మహానటితో బెస్ట్ హిట్ అందుకుంది. సినిమా సూపర్ హిట్ కావడంతో డిమాండ్ ను పెంచుకొని ఇప్పుడు బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. పవన్ సినిమా తరువాత అను అల్లు అర్జున్ తో నాపేరు సూర్య సినిమా చేసింది. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యింది. దీంతో పాటు నాగచైతన్యతో చేసిన శైలజా రెడ్డి అల్లుడు కూడా పెద్దగా కలిసి రాలేదు.
దీంతో టాలీవుడ్ లో అను అంటే భయపడుతున్నారు. అయితే, తమిళంలో ఇప్పుడిప్పుడే అవకాశాలు దక్కించుకుంటోంది. శివకార్తికేయతో ఓ సినిమా చేస్తున్నది. ఇదిలా ఉంటె, ఈ అమ్మడు రీసెంట్ గా షూటింగ్ కోసం వారణాసి వెళ్ళింది. అక్కడ షూటింగ్ చేసే సమయంలో ఓ రెస్టారెంట్ కు వెళ్లి చాక్లెట్ కేక్ ఆఫర్ చేసింది. ఆ చాక్లెట్ కేక్ తినే సమయంలో తన కళ్ళు ఓ వైపుకు చూస్తున్నాయి. తన పక్కన ఎవరో ఉన్నారని ఆ కళ్ళు చెప్తున్నాయి.
నేను కాకుండా నా పక్కన ఒకరు ఉన్నారు.. వాళ్ళు ఎవరో చెప్పుకోండి చూద్దాం అనే పజిల్ ను ఇచ్చింది ఈ స్టార్ హీరోయిన్. ఆ పక్కన ఉన్నది హీరోనా.. లేదంటే ఈ హీరోయిన్ బాయ్ ఫ్రెండా.. లేదంటే ఇంకెవరైనానా... ఫ్రేమ్ లో కనిపించని వ్యక్తిని ఎవరో చెప్పమంటే ఎలా అను.. అతనెవరో అంచనా వేసి చెప్పడానికి మాకు అంజనం రాదనీ నెటిజన్లు అంటున్నారు. అదెవరో అనూనే రెవీల్ చేయాలి.