బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు పెట్టుకున్న టార్గెట్ చూసి టాప్ హీరోలు కూడ  ఆశ్చర్యపోతున్నట్లు సమాచారం. సంపూ హీరోగా నటించిన ‘కొబ్బరి మట్ట’ మూవీలో   సంపూ మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘పెదరాయుడు’ ‘పాపారాయుడు’ ‘ఆండ్రాయుడు’ అనే మూడు పాత్రలలో నటిస్తున్న ఈమూవీ  ఆగష్టు 10న విడుదల కాబోతోంది. 

ఇప్పటికే అనేక సార్లు విడుదల వాయిదా పడ్డ ఈ మూవీ పై అందర్నీ ఆకర్షించేలా ఈ మూవీ యూనిట్ అనేక డిఫెరెంట్ ప్రమోషన్ పద్ధతులు అనుసరిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి మూడున్నర నిముషాల నిడివి గల పెద్ద డైలాగు నాన్ స్టాప్ గా చెప్పి ప్రపంచ రికార్డు సృష్టించిన సంపు మరో అడుగు ముందుకు వేసి ఈమూవీ యూనిట్ చేత ఇప్పుడు తాజాగా ఒక పేపర్ యాడ్ ఇప్పించాడు. 

‘కొబ్బరిమట్ట’ మొదటి వారం కలెక్షన్ల అంచనా 233.64 కోట్లని అంటూ పేపర్ యాడ్ ఇచ్చి అందరి మైండ్స్ బ్లాంక్అయ్యేలా చేసాడు. దీనితో ఈసినిమా విడుదల కాకుండానే కలెక్షన్స్ రికార్డులు ప్రకటించిన సినిమాగా ‘కొబ్బరిమట్ట’ మరో రికార్డు క్రేయేట్ చేసింది.   ప్రస్తుతం ఈ మూవీ నాగార్జున ‘మన్మథుడు 2’ తో పోటీ గా విడుదల అవుతున్న పరిస్థితులలో ఈ సినిమా నాగ్ తో పోటీకి నిలబడగలదా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.   

ఇలాంటి సందర్భంలో  సంపూర్ణేష్ బాబు తన ట్విట్టర్‌లో నాగార్జునను టార్గెట్ చేస్తూ ఒక ట్విట్ చేసి మరో సంచలనం సృష్టించాడు. ‘‘మా కొబ్బరిమట్ట చిత్రాన్ని ఆగస్ట్ 10న విడుదల చేయబోతున్నాము. మాకు కింగ్ నాగార్జునగారి, దర్శకుడు రాహుల్‌గారి, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌ గారి మరియు వెన్నెల కిషోర్ అన్నగారి ఆశీస్సుల కావాలి. మీ సినిమా హౌస్‌ఫుల్స్ అయ్యి, టికెట్స్ దొరక్క మా సినిమాకి రావాలని కోరుకుంటున్నాను. మీ సంపూర్ణేష్ బాబు..’’ అని సంపూర్ణేష్ బాబు చేసిన ట్వీట్‌కు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ‘తథాస్తు సంపూగారు.. ఆల్ ది బెస్ట్’ అంటూ రిప్లయ్ ఇచ్చాడు. ఈ సినిమా మొదలు పెట్టిన    నాలుగేళ్ళ తరువాత ఇప్పుడు విడుదల అవుతున్న పరిస్థుతులలో ఈసినిమాకు మంచి కలక్షన్స్ వస్తే మళ్ళీ సంపూ హవా మొదలయ్యే ఆస్కారం ఉంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: