డ్వేన్ బ్రావోతో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒక సినిమాని ని నిర్మిస్తుంది. అన్ని రకాల జోనర్స్ లో సినిమాలు అందించాలనే ఉద్దేశ్యంతో ఇప్పటి వరకు ఈ సంస్థ నుండి వైఫ్ ఆఫ్ రామ్, ఎం ఎల్ ఎ, గూఢచారి, ఓ బేబి లాంటి విభిన్నమైన సినిమాలు తీశారు. దీంతో అటు ఆడియన్స్ లో ఇటు ఇండస్ట్రీలో మంచి అభిరుచి గల సంస్థగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం మరో కొత్త జోనర్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
అయితే ఈ సంస్థ ప్రస్తుతం విక్టరీ వెంకటేష్- నాగచైతన్య లు కలిసి నటిస్తున్న " వెంకీ మామ "అనే చిత్రాన్ని , అలాగే అనుష్క నటిస్తున్న "నిశ్శబ్దం" అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. అయితే కేవలం సినిమాలు చేసి సొమ్ము చేసుకోవడమే లక్ష్యం కాకుండా సామాజికంగా స్పృహ కలిగించాలనే సదుద్దేశ్యంతో సోషల్ అవేర్నెస్ ఫిలిమ్ ను నిర్మిస్తున్నారు నిర్మాతలు టి. జి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల.
కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లో(CSR) భాగంగా వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావోతో కలిసి ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ సినిమాకి ఆర్తి శ్రీ వాస్తవ దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్తి శ్రీవాస్తవ ఇంతకుముందు ల్యాండ్ ఆఫ్ విడోస్ మరియు వైట్ నైట్ అనే రెండు డాక్యుమెంటరీలకు దర్శకత్వం వహించింది. ఈ డాక్యుమెంటరీ ఫిలిమ్స్ కి అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించింది.
ఇప్పుడు మహిళల శుభ్రత విషయంలో అవగాహన కలిగించేందుకు డ్వేన్ బ్రావో తో ఈ సినిమాని చేస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రచార చిత్రాన్ని డ్వేన్ బ్రావో తన అధికారికి సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశాడు. దర్శకురాలు చిత్ర విశేషాలను తెలియజేస్తూ తమిళనాడులో జులైలో షూటింగ్ జరుపుకున్నాం.ఆగస్టులో వెస్టిండీస్ లో షూటింగ్ జరుపుకోనుందని తెలియజేసింది