అక్కినేని నాగార్జున తనయుడిగా అక్కినేని అఖిల్ ఎన్నో ఆశలతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా తొలి సినిమా వి. వి. వినాయక్ దర్వకత్వంలో వచ్చిన `అఖిల్` సినిమాలో నటించాడు. ఆ సినిమా ఘోరంగా డిజాస్టర్ అవ్వడం నిరాశ పరిచింది. ఆ తర్వాత సొండ బ్యానర్లో `హలో` వంటి క్లాస్ మూవీ కూడా అఖిల్ను సక్సెస్ ట్రాక్ ఎక్కించలేకపోయింది. ఇక ముచ్చటగా మూడో సారి వెంకీ అట్లూరి దర్శకత్వంలో ప్రేమకథగా రూపొందిన `మిస్టర్ మజ్ను` చిత్రం కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. హ్యాట్రిక్ పరాజయాలు చవి చూసిన అఖిల్ నాలుగో సారి అదృష్టాన్ని పరిక్షించుకోనున్నాడు.
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ తన నాలుగో సినిమా చేయబోతున్నాడు. ఇప్పటి వరకు వచ్చిన మూడు సినిమాలు కూడా డిజాస్టర్ అయినా అఖిల్కు మాత్రం ఫాలోయింగ్ బాగానే ఉంది. గీతా ఆర్ట్స్ 2 బేనర్లో బన్నీ వ్యాస్ ఈ మూవీని నిర్మించబోతున్నారు. ఆ సినిమా మంచి క్యూట్ లవ్ స్టోరీతో కూడిన ఫ్యామిలీ ఎంటటైనర్గా సాగుతుందని సమాచారం. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లింది కానీ.. ఇంకా హీరోయిన్ అయితే దొరకలేదు. ఈ సినిమాకు ఓ కొత్త హీరోయిన్ కోసం వేతుకుతూనే ఉన్నారట.
ఇప్పటికే మూడు నెలలుగా సరైన హీరోయిన్ దొరక్క ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాలేదు. రష్మిక మందన్నా ఇలా ఎందరో హీరోయిన్ల పేర్లు బయటకు వచ్చాయి గానీ ఎవరూ ఫైనల్ కాలేదు. అయితే లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం పూజా హెగ్డే లాంటి టాప్ హీరోయిన్ కావాలని అఖిల్ కోరుకుంటున్నట్టు సమాచారం. ఆల్రెడీ `ఒక లైలా కోసం` చిత్రంలో నాగచైతన్య సరసన పూజా హెగ్డే నటించింది. మరి ఇప్పుడు అన్న హీరోయిన్తో అఖిల్ రొమాన్స్ చేయాలనుకుంటున్నాడు. మూడు వరుస డిజాస్టర్లలో ఉన్న అఖిల్ ఈ సినిమాతో అయినా సక్సెస్ పట్టాలెక్కుతాడో? లేదో? చూడాలి.