ఛలో సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది రష్మిక మందన్న. తొలి సినిమాతోనే సూపర్ హిట్ రావటంతో రష్మికకు వరుసగా అవకాశాలు వచ్చాయి. ఛలో తరువాత రష్మిక మందన్న విజయ్ దేవరకొండ సరసన గీతా గోవిందం సినిమాలో నటించింది. గీతా గోవిందం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావటంతో స్టార్ హీరోల సినిమాల్లో కూడా రష్మికకు అవకాశాలు వచ్చాయి. గీతా గోవిందం సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో రష్మికకు అభిమానులు కూడా పెరిగారు. 
 
గీతా గోవిందం తరువాత రష్మిక నానీకి జోడీగా దేవదాస్ సినిమాలో నటించింది. ఈ సినిమా యావరేజ్ ఫలితాన్ని అందుకుంది. గత వారం రష్మిక నటించిన డియర్ కామ్రేడ్ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో స్టేట్ క్రికెట్ ప్లేయర్ గా కనిపించింది రష్మిక. సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాకపోయినా రష్మిక నటనకు మాత్రం ప్రశంసలు వచ్చాయి. రష్మిక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అభిమానులు హీరోయిన్ల మీద అభిమానంతో గుడి కట్టిస్తున్నారు. మా నాన్న ప్రముఖ నటి కుష్బూ కు అభిమానులు గుడి కట్టించారు అనే విషయం చెప్పినప్పుడు ఆ విషయం నేను నమ్మలేకపోయాను. కానీ ఇప్పుడు నాకు కూడా అభిమానులు ఎవరైనా గుడి కట్టిస్తే బాగుంటుందని అన్నారు. 
 
ప్రస్తుతం రష్మిక మందన్న మహేశ్ బాబు సరసన అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో ఒక సినిమా, నితిన్ కు జోడీగా మరో సినిమాలో నటిస్తుంది. టాలీవుడ్లో ప్రస్తుతం రష్మిక చేతిలో ఉన్నన్ని సినిమాలు మరే హీరోయిన్ చేతిలో లేవు. స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తుండటంతో గతంలో కంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటోంది రష్మిక.మరి రష్మిక అభిమానులు గుడి కట్టిస్తే బాగుంటుందన్న కోరిక అభిమానులు ఎవరైనా తీరుస్తారేమో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: