టాలీవుడ్ లో అప్పట్లో పలు విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించి, సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ, ఆ తరువాత తన డైరెక్షన్ టాలెంట్ తో బాలీవుడ్ కి వెళ్లారు, ఇక అక్కడి బడా స్టార్స్ తో సినిమాలు తెరకెక్కించిన వర్మ, మన తెలుగు వారి ఖ్యాతిని మరింత పెంచారు. అయితే ఇటీవల కొన్నేళ్లుగా సినిమాలు తీస్తున్న వర్మకు సరైన విజయం మాత్రం దక్కడం లేదు. అయినప్పటికీ ఆయన అప్పుడప్పుడూ ఇంకా పట్టువదలని విక్రమార్కుడివలె సినిమాలు తీస్తూనే వున్నారు. 

ఇకపోతే ఏదైనా అంశంపై తన అభిప్రాయాన్ని ముక్కుసూటిగా చెప్పే వర్మ, దాని వలన జరిగే పర్యవసానాలకు ఏ మాత్రం భయపడరు. ఇక అక్కడక్కడ జరిగే కొన్ని సమకాలీన అంశాలపై తన స్టయిల్లో స్పందించే వర్మ, ఇటీవల తాను తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విషయమై అప్పటి టిడిపి ప్రభుత్వం, ఆ సినిమాను ఆంధ్రాలో విడుదల చేయనీకుండా, అలానే ఆ సినిమా విషయమై తాను విజయావాడలో ప్రెస్ మీట్ పెట్టడానికి వస్తే, తనను బలవంతంగా అడ్డగించారని కొంత ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక అప్పటినుండి టీడీపీ పై అలానే చంద్రబాబుపై తన సోషల్ మీడియా ఖాతాల్లో జస్ట్ అస్కింగ్ పేరుతో సెటైర్లు పేలుస్తూ వస్తునారు వర్మ. ఇక ఇటీవల ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడంతో వర్మ మరింత సంబరంగా టిడిపి పార్టీపై సెటైర్లు వేయడం మరింత పెంచారు. 

ఇక కొద్దిరోజలుగా అమెరికా పర్యటనలో ఉన్న మాజీ సీఎం చంద్రబాబు గారు, అక్కడి ఒక స్టాల్ లో పాప్ కార్న్ కొనుక్కుని తింటున్న వీడియోని, వర్మ తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ, ఒకపుడు రోజుకు 20 గంటలకు పైగా కష్టపడే వ్యక్తి, నేడు అమెరికా వీధుల్లో ఒక సామాన్యుడిలా పాప్ కార్న్ కొనుక్కు తినడం చూస్తుంటే నిజంగా ఆశ్యర్యంగా ఉంది అంటూ వ్యంగ్యంగా ఎమోజిలు పోస్ట్ చేయడం జరిగింది. ఇక ఈ పోస్ట్ పై వర్మ అభిమానులు కొందరు ఛలోక్తులు పేలుస్తుంటే, టిడిపి పార్టీ ఫ్యాన్స్ మాత్రం, ఇకనైనా వర్మ గారు ఈ విధమైన చౌకబారు ట్వీట్స్ చేస్తూ తమ నాయకులను కించపరచడం మానుకోవాలి అంటూ ఆయనకు హితవు పలుకుతున్నారు. మరి వర్మ తాజా పోస్ట్ పై టీడీపీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: