బాహుబలి ద్వారా తెలుగు సినిమా ఏంటో ప్రపంచానికి చాటిన దర్శకుడు "రాజమౌళి". బాహుబలి సినిమాతో తెలుగు సినిమా గతి మారిపోయిందంటే అతిశయోక్తి కాదేమో! అప్పటి వరకు ఇడ్లీ సాంబార్ కథలంటూ దక్షిణాది సినిమాను చిన్న చూపుగా చూసిన బాలీవుడ్ సైతం బాహుబలి సినిమా చూసి ముక్కున వేలేసుకుంది. వారు ఊహించని ఊహాజనిత ప్రపంచంలోకి తీసుకెళ్ళిన రాజమౌళిని ఆకాశానికి ఎత్తేశారు.


ఇక అప్పటి నుండి బాలీవుడ్ కన్ను తెలుగు సినిమాలపై పడింది. దాంతో మన సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ కి వెళ్తున్నాయి. మన కథలకి బాలీవుడ్ మంచి గిరాకీ ఉంది. అయితే దీనంతటికి కారణం రాజమౌళినే అని చెప్పక తప్పదు.అయితే అంతటి మానియా క్రియేట్ చేసిన రాజమౌళి తన తర్వాతి సినిమాను బాలీవుడ్ నటులతో తీస్తారని అనుకున్నారు. కానీ మళ్ళీ మన తెలుగు నటులతో మ్యాజిక్ క్రియేట్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు.


డి వి వి దానయ్య నిర్మాతగా ఆర్ ఆర్ ఆర్ సినిమాను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్నారు. రామ్ చరణ్ కి జోడీగా ఆలియా భట్ ని ఎంపిక చేసుకున్నారు. ఎన్టీఆర్ కి జోడీ ఇంతవరకు కుదరలేదు.ఈ విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.అయితే సినిమా ప్రమోషన్ల విషయంలో ముందుండే  రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ నుండి కొత్త అప్డేట్  ఇచ్చాడు.


ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఒకరితో స్నేహం అనేది అనుకోకుండానే మొదలవుతుంది మా రామరాజు, భీం లా మాదిరిగా... అంటూ మీ జీవితంలో అనుకోకుండా కలిసిన వాళ్ళే మీ క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారని... ఫ్రెండ్ షిప్ డేకి విషెష్ తెలియజేసింది. ఈ అప్డేట్ తో ఎన్టీఆర్, చరణ్ అభిమానులు ఖుషీగా ఉన్నారు. 2020 జూన్ లో ఈ సినిమాని విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: