రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కత్వంలో  కింగ్ నాగార్జున హీరోగా,  రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌ గా న‌టిస్తోన్న చిత్రం `మ‌న్మ‌థుడు 2`.   రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ గా రానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి  రంగం సిద్ధం చేసుకుంది.  ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వేసిన సెట్ కూడా  పూర్తి అయింది. ప్రస్తుతం ఈ సెట్ ఫోటో సోషల్ మీడియా బాగా షేర్ అవుతుంది.  ఇక  ఈ చిత్రంలో నాగార్జున క్యారెక్టర్ ఫుల్ ఎంటర్ టైన్మెంట్ గా ఉంటుందని..  ప్రత్యేకించి నాగ్ కామెడీ టైమింగ్ సినిమా మొత్తంలోనే హైలెట్ గా నిలుస్తోందని తెలుస్తోంది. దర్శకుడు రాహుల్ రవీంద్రన్  నాగ్ పాత్రను బాగా తీర్చిదిద్దారట. పైగా  'సొగ్గాడే చిన్ని నాయన' తర్వాత కుటుంబ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకునే సినిమాలేవీ నాగ్ చేయలేదు.  నాగ్ నుండి ఫ్యామిలీ ఆడియన్స్ ఎలాంటి సినిమాను ఆశిస్తారో అలాంటి సినిమానే ఇది.  రొమాన్స్, ఫన్, ఫ్యామిలీ ఎమోషన్స, మంచి పాటలు, నాగ్ ఛార్మింగ్ స్క్రీన్ ప్రెజెన్స్  ఇలా వారికి కావల్సినవన్నీ ఉన్నాయి.  అందుకే నాగ్ గత మూడు చిత్రాలకు లేని క్రేజ్ ఈ చిత్రానికి ఉంది. 


ఈ సినిమా గురించి కింగ్‌ నాగార్జున కూడా 'మన్మథుడు వచ్చి 15 సంవత్సరాలు అయ్యింది.  అయినా ఈ సినిమా చాలా ఈజీగా, సాఫీగా సాగింది..  ఈ సినిమాకు చాలా  ఎంజాయ్‌ చేశాం.   తప్పకుండా ఈ సినిమా అందరినీ మెప్పించేలా ఉంటుంది'' అన్నారు.   అందుకు తగ్గట్లుగానే  ఈ సినిమా డిజిటిల్ రైట్స్ ను ప్రముఖ ఆన్ లైన్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్  7.4 కోట్లకు కొనుగోలు చేసింది.   


ఈ చిత్రంలో  రకుల్ ప్రీత్ సింగ్ నే కాకుండా  సమంత, కన్నడ  బ్యూటీ అక్షరా గౌడ కీలక పాత్రల్లో  నటిస్తున్నారు. కాగా  గత కొన్ని  రోజుల నుండి  ఈ సినిమా  షూటింగ్ హైదరాబద్ లో  శరవేగంగా జరుగుతుంది.  ఈ చిత్రానికి నిర్మాతలు: నాగార్జున అక్కినేని, పి. కిరణ్, సంగీతం: చైతన్ భరద్వాజ్,  సినిమాటోగ్రఫీ: ఎం సుకుమార్,  స్క్రీన్ ప్లే: రాహుల్ రవీంద్రన్, సత్యానంద్. మరి నాగార్జునకి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏ స్థాయి హిట్ ఇస్తోందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: