తమిళ స్టార్ హీరో తల అజిత్ ఈ ఏడాది పొంగల్ కు 'విశ్వాసం' తో వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు. ఈ చిత్రం కోలీవుడ్ లో 200 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. శివ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో నయన తార కథానాయికగా నటించగా జగపతి బాబు విలన్ పాత్ర పోషించారు. ఇక అజిత్ నటించిన తాజా చిత్రం 'నెర్కొండ పరవాయ్' ఈనెల 8న భారీ స్థాయిలో విడుదలవుతుంది. కాగా చెన్నై లో వున్న మాయాజాల్ మల్టీ ఫ్లెక్స్ థియేటర్ లో మొదటి రోజు రికార్డు స్థాయిలో ఈసినిమాను 72 షోలతో ప్రదర్శించనున్నారు. ఇక అజిత్ కు వున్నా ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఈసినిమా కు భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయంగా కనిపిస్తుంది.
బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'పింక్' కు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రంలో ఒరిజినల్ వెర్షన్ లో అమితాబ్ పోషించిన పాత్రలో అజిత్ కనిపించనుండగా తాప్సి పాత్రలో కన్నడ బ్యూటీ శ్రద్ద శ్రీనాథ్ నటించిందిఖాకి ఫేమ్ వినోత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించిగా బాలీవుడ్ నటి విద్యా బాలన్ ముఖ్య పాత్రలో నటించింది. జీ స్టూడియోస్ తో కలిసి ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఈచిత్రాన్ని నిర్మించారు.
అయితే అజిత్ నటించిన వివేగం , విశ్వాసం చిత్రాలను తెలుగులో కూడా విడుదలచేయగా ఈ రెండు అక్కడ డిజాస్టర్ లు అయ్యాయి. అసలే ముందునుండి అజిత్ కు కు అక్కడ మార్కెట్ లేదు దానికి తోడు ఈ రెండు సినిమాలు ఇంకా నష్టాన్నే కలిగించాయి. దాంతో నెర్కొండ పరవాయ్ ను తెలుగులో విడుదల చేయడానికి సాహసం చేయడం లేదు.