వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 3. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న కేజ్రీ షో 'బిగ్ బాస్ 3' రెండు తెలుగు రాష్ట్రలలో ట్రేండింగ్ షో. 2 వారల క్రితం ఎన్నో వివాదాల మధ్య ప్రారంభమైన ఈ బిగ్ బాస్ షోలో రోజుకో మలుపుతో అందరిని ఆశ్చర్య పరుస్తుంది. మొదటి వారం సీనియరు నటి హేమ ఎలిమినేట్ అవ్వగా ఈసారి టీవీ 9 ముఖా ముఖీ యాంకర్ జాఫర్ ఎలిమినేట్ అయ్యారు. 


అందరూ అనుకున్నారు ఈసారి కచ్చితంగా వరుణ్ భార్య వితిక షేరు ఎలిమినేట్ అవుతారు అని. కారణం వితిక షేరు పద్ధతిని ప్రేక్షకులు జీర్ణించుకోలేక పోతున్నారు. కానీ అనుకోని రీతిలో జాఫర్ ఎలిమినేట్ అయ్యాడు. దీంతో బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కాంటస్టెంట్లకు చాలామందికి కన్నీళ్లు వచ్చేసాయి. బాబా మాస్టర్ పరిస్థితి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. 


బాబా మాస్టర్ బిగ్ బాస్ కి వచ్చినప్పటి నుంచి జాఫర్ తో నే ఉన్నారు. నిజానికి జాఫర్ బిగ్ బాస్ లో కి వచ్చినప్పుడు ప్రజలందరూ ఎన్ని గొడవలు తెస్తాడో ఏంటో, బిగ్ బాస్ హౌస్ ని చిన్నాభిన్నం చేస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ జాఫర్ అనుకోని రీతిలో బిగ్ బాస్ హౌస్ లో అతని పద్ధతి ఉంది. నిజానికి అతను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి వచ్చిన అతనికి ప్రజల వైపు నుంచి ఎంతో ఆదరణ ఉంది. 


అయితే జాఫర్ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చే సమయంలో వరుణ్ సందేశ్ కి వార్నింగ్ ఇచ్చి వచ్చారు. ఆ వార్నింగ్ ఏంటంటే 'వరుణ్ బాబా మాస్టర్ మైండ్ గేమ్ ఆడుతున్నాడు అని అంటున్నవ్, ఇంకోసారి ఆలా అనకు వరుణ్' అంటూ ఏడ్చుకుంటూ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చారు ముఖ ముఖి జాఫర్.         


మరింత సమాచారం తెలుసుకోండి: