యువరత్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. సీకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత సీ కళ్యాణ్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య రెండు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ ఇద్దరు బాలయ్యల సరసన ఇద్దరు హీరోయిన్లు సోనాల్ చౌహాన్, వేదిక నటించనున్నారు.
ఇక ఈ సినిమాకు రూలర్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ వచ్చే వారం నుండి బ్యాంకాక్ లో జరుగనుంది. ఈ షెడ్యూల్ లో బాలయ్య – సోనాల్ చౌహాన్ మరియు వేదికల సాంగ్స్ ను షూట్ చేయనున్నారు. ఇక బాలయ్య ఈ సినిమాను సాంగ్తోనే స్టార్ట్ చేయడం విశేషం.
అయితే సోనాల్ చౌహన్ మధ్య వయస్సులో ఉండే బాలయ్య పాత్రకు జోడీగా కనిపించనుంది. గతంలో ఈమె బాలకృష్ణతో కలిసి సోనాల్ ‘లెజెండ్, డిక్టేటర్’ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాల్లో లెజెండ్ సూపర్ హిట్ అయ్యింది. ఇక డిక్టేటర్ యావరేజ్ మార్కులు వేయించుకుంది.
డిక్టేటర్ తర్వాత ఆమె చేస్తున్న తెలుగు చిత్రం కూడా ఇదే కావడం విశేషం. ఇక బాలయ్య - కేఎస్.రవికుమార్ కాంబోలో ఇప్పటికే జై సింహా సినిమా వచ్చి కమర్షియల్గా హిట్ అయ్యింది. ఇప్పుడు వీరిద్దరి కాంబో మరోసారి రిపీట్ అవుతుండడంతో మంచి అంచనాలు ఉన్నాయి.
2018 సంక్రాంతికి వచ్చిన జై సింహా సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ హిట్ అయ్యింది. అజ్ఞాతవాసికి పోటీగా వచ్చిన బాలయ్య మిట్ కొట్టాడు. ఇక ఈ యేడాది రెండు ఎన్టీఆర్ బయోపిక్లతో తీవ్రంగా నిరాశపరిచిన బాలయ్య ఈ సినిమాపై మంచి ఆశలతో ఉన్నాడు. మరి కేఎస్.రవికుమార్ బాలయ్య ఆశలు ఎంత వరకు నెరవేరుస్తాడో ? చూడాలి.