పవన్ కళ్యాణ్ తో తీసిన అజ్ఞాతవాసి దారుణమైన ఫ్లాప్ కావడంతో ఆ సినిమా కాపీ అని డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ సమయంలో దారుణమైన కామెంట్లు వచ్చాయి. అంతేకాకుండా త్రివిక్రమ్ డైరెక్షన్ పై కూడా రకరకాల కామెంట్లు ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వచ్చాయి. అదే సమయంలో త్రివిక్రమ్ కాపీ క్యాట్ అనే బిరుదు కూడా ఇచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత వీర రాఘవ అనే సినిమా తీసి తనపై విమర్శలు చేసిన వారికి ధీటుగా సినిమాతో సమాధానం చెప్పాడు త్రివిక్రమ్.


ఇటువంటి నేపథ్యంలో తాజాగా అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి. అసలు మేటర్లోకి వెళితే ఈ సినిమాలో కమెడియన్ గా తన ప్రాణ స్నేహితుడు సునీల్ ని తీసుకున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు అప్పట్లో వచ్చాయి. అయితే ఈ పాత్ర సినిమాలో కీలక పాత్ర పోషించే రావు రమేష్ పక్కన ఉండే పాత్ర అని..ప్రత్యేకంగా సునీల్ కోసం త్రివిక్రమ్ తయారు చేశాడని సమాచారం. అయితే రావు రమేష్ కాల్షీట్స్ సర్దుబాటు కాకపోవటంతో ఆ పాత్రకి హర్ష వర్ధన్ ని తీసుకున్నారు.


దీంతో సునీల్ పాత్రకి ప్రాధాన్యత తగ్గించవలసి వస్తుంది. ఈ క్రమంలో అసలు ఆ పాత్రని తీసేసినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా మొన్న సినిమాలో కొన్ని అనివార్య కారణాలవల్ల 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి పాత్ర కూడా లేకుండా త్రివిక్రమ్ చేయడంతో ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో రకరకాల వార్తలు వినబడుతున్నాయి. మొత్తం మీద ఈ సినిమాలో ఇద్దరు పెద్ద కమెడియన్లను సినిమాలో నుండి త్రివిక్రమ్ తీసేయడంతో….సినిమాలో కామెడీ పాత్రలు ఎవరు చేస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి: