‘సైరా’ మూవీ యూనిట్ తో రామ్ చరణ్ ప్రత్యేక ఇంటర్వ్యూలు చేస్తూ ప్రమోట్ చేస్తాడు అని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇంకా చరణ్ ఆపని మొదలుపెట్టకుండానే ఉపాసన రంగంలోకి దిగి చిరంజీవితో ఒక ప్రత్యేక ఇంటర్వ్యూను చేయడమే కాకుండా అనేక ఆసక్తికర ప్రశ్నలు అడుగుతూ చిరంజీవి నుండి సమాధానాలు రాబట్టింది. 

ఉపాసన ఎడిటర్ గా వ్యవహరిస్తున్న అపోలో సంస్థ ప్రచురించే బి పాజిటివ్ పత్రికలో చిరంజీవితో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో చిరంజీవి హెల్త్ కు సంబంధించి తీసుకుంటున్న జాగ్రత్తల గురించి అదేవిధంగా ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన ఆరోగ్య సూత్రాల గురించి ఉపాసన అనేక విషయాల పై చిరంజీవి అభిప్రాయాలు రాబట్టేంది. 

ఈ సందర్భంలో చిరంజీవి లేటెస్ట్ గా నటిస్తున్న ‘సైరా మూవీ గురించి చిరంజీవి వద్ద నుండి వివరాలు సేకరిస్తూ అసలు ఆసినిమాను నేటితరం ప్రేక్షకులు ఎందుకు చూడాలి అంటూ చిరంజీవిని కార్నర్ చేసే ప్రశ్నలు వేసింది ఉపాసన. దీనికి చిరంజీవి సమాధానం ఇస్తూ దేశ చరిత్ర గురించి సంస్కృతి గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన అవసరం ఉంది అని క్లారిటీ ఇస్తూ నేటి తరానికి స్వాతంత్రోద్యమ చరిత్ర తెలియ చేయడానికి తాను ‘సైరా’ ను నిర్మించిన విషయాన్ని తెలియ చేసాడు. 

ఒక జర్నలిస్టులా ఉపాసన చిరంజీవిని ఇంటర్వ్యూ చేసిన ఆ ఇంటర్వ్యూ చదివిన వారందరికీ మహిళా వ్యాపార వేత్తగానే కాకుండా ఉపాసన జర్నలిస్టుగా కూడ బాగా రాణించింది అని అనిపించడం సహజం. దీనితో బుల్లితెర పై ఇంటర్వ్యూలు చేస్తూ యాంకర్ గా రాణించాలి అని కలలు కంటున్న చరణ్ ముందుగానే పసికట్టి ఉపాసన చరణ్ కు స్వీట్ షాక్ ఇచ్చింది అనుకోవాలి. ఈ పరిస్థుతులలో రానున్న రోజులలో ‘సైరా’ ప్రమోషణ్ కోసం ఉపాసన చరణ్ లు కలిసి ఇంటర్వ్యూలు చేసినా ఆశ్చర్యం లేదు..



మరింత సమాచారం తెలుసుకోండి: