టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది కమెడియన్స్ ఉన్నా బ్రహ్మానందం సునీల్ ల  కెరియర్ రికార్డు మరెవ్వరూ బ్రేక్ చేయలేరు. కమెడియన్ గా 1000 సినిమాలకు పైగా నటించి గిన్నీసు బుక్ రికార్డుకు ఎక్కిన బ్రహ్మానందం రికార్డుల వైపు మరే కమెడియన్ కన్నెత్తి కూడ చూడలేడు. 

అయితే  బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ అనుకోకుండా బ్రహ్మానందం సునీల్ ల రికార్డులకు చెక్ పెట్టడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. తెలుస్తున్న సమాచారం మేరకు తిరిగి కామెడీ వేషాల వైపు యూటర్న్ తీసుకున్న బండ్ల గణేష్ తాను లేటెస్ట్ గా నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో రోజుకు 5 లక్షల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. 

వాస్తవానికి ఈ స్థాయి పారితోషికం టాలీవుడ్ కమెడియన్స్ లో ఇప్పటి వరకు అందుకున్నది బ్రహ్మానందం సునీల్ లు మాత్రమే. అయితే దర్శకుడు అనీల్ రావిపూడి బండ్ల గణేష్ కోసం సృష్టించిన ఈపాత్ర అతడు తప్ప మరెవ్వరు నటించలేరు అన్న ఉద్దేశ్యంతో నిర్మాత దిల్ రాజ్ ను ఒప్పించి బండ్ల గణేష్ కు రోజుకు 5 లక్షలు చొప్పున భారీ పారితోషికం ఇస్తున్నట్లు టాక్. 

బండ్ల గణేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో నటిస్తున్న విషయం తెలుసుకుని దర్శకుడు మారుతీ లేటెస్ట్ గా తీస్తున్న ‘ప్రతిరోజు పండగే’ మూవీలో బండ్ల గణేష్ చేత ఒక పాత్ర చేయించాలి అని భావిస్తే ఈ బ్లాక్ బస్టర్ నిర్మాత తనకు ఆమూవీలో కూడ రోజుకు 5 లక్షలు చొప్పున అడగడంతో మారుతి మైండ్ బ్లాంక్ అయినట్లు టాక్. దీనితో బండ్ల గణేష్ కు బదులు ఈమూవీలో అజయ్ ని తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇలా బండ్ల గణేష్ భారీ పారితోషికం వార్తలు సంచలనంగా మారిన పరిస్థితులలో ఇది అంతా వాస్తవమా లేదంటే బండ్ల గణేష్ ఇమేజ్ పెంచడానికి వస్తున్న లీకులా అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: