ఇటీవ‌ల ఒకేరోజు ఇద్ద‌రు యంగ్ హీరోల సినిమా విడుద‌ల కావ‌డం స‌హ‌జం అయిపోయింది. ఈ క్ర‌మంలోనే గ‌త వారం బెల్లంకొండ శ్రీ‌నివాస్ `రాక్ష‌సుడు` సినిమాతో పాటు కార్తికేయా `గుణ 369` సినిమా విడుద‌ల అయింది. అయితే రెండికి టాక్ బాగానే ఉన్నాకోలీవుడ్‌లో హిట్ టాక్ తెచ్చుకున్న `రాచ్చసన్` సినిమాకు రీమేక్‌గా వ‌చ్చిన రాక్ష‌సుడు వంటి క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుని కొంచెం బెట‌ర్ టాక్ తెచ్చుకుంది. 


ఇక ఆగ‌ష్టు 9న కింగ్ నాగార్జున మ‌న్మ‌థుడు 2 సినిమాతో పాటు యాంకర్ అన‌సూయ క‌థ‌నం సినిమా విడుద‌ల కాబోతుంది. ఇక ఆగ‌స్టు 15న‌ మ‌రో ఇద్ద‌రు యంగ్‌ హీరోల మ‌ధ్య ఇంట్ర‌స్టింగ్ ఫైట్ జ‌ర‌గ‌నుంది. రిలీజ్ కాబోతున్నాయి. శర్వానంద్ సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రణరంగం’ మ‌రియు పీవీపీ నిర్మించిన‌ `ఎవ‌రు` సినిమాలు విడుద‌ల కాబోతున్నాయి. ఇప్ప‌టికే ఈ రెండు సినిమాల ఫస్ట్ లుక్, టీజర్‌ల‌కు బాగానే రెస్పాన్స్ వ‌చ్చాయి. 


ఎప్పుడూ డిఫ‌రెంట్ క‌థ‌లు ఎంచుకుంటోన్న‌ శ‌ర్వానంద్ ఈ సారి యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమాను ఎంచుకున్నాడు. ఈ గ్యాంగ్‌స్టర్‌ డ్రామాలో కాజల్‌ అగర్వాల్, కళ్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. నిజానికి శ‌ర్వానంద్‌కు ఇటీవ‌ల ఏ సినిమా హిట్ ఇవ్వ‌లేక‌పోయాయి. అయితే సినిమాపై అంచ‌నాలు బాగానే ఉండ‌డంతో ఫ‌స్ట్ డే ఓపెనింగ్స్ బాగా ఉంటాయ‌ని అంచ‌నాలు ఉన్నాయి. 


ఇక రెజీనా క‌సాండ్ర హీరోయిన్‌గా న‌టిస్తున్న సినిమా `ఎవ‌రు`. సస్పెన్స్ థ్రిల్లర్ కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిన అడ‌వి శేష్‌ గూఢ‌చారి హిట్ త‌ర్వాత మంచి ఫామ్‌లో ఉన్నాడు. అయితే ఇప్పుడు ఇదే త‌ర‌హాలో వ‌స్తున్న ఈ సినిమాపై కూడా అంచ‌నాలు బాగానే ఉన్నాయి. మ‌రి సాహో వాయిదా ప‌డ‌డంతో.. ఆగ‌ష్టు 15 విడుద‌ల కాబోతున్న ఈ రెండు సినిమాల‌లో బాక్సాఫీస్ వ‌ద్ద ఏది చేయి సాధిస్తుందో?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: