సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. సూపర్ స్టార్ మహేష్ తన జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, దిల్ రాజు  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ లో వేసిన కొండారెడ్డి బురుజు సెట్ లో షూటింగ్ జరుపుకున్న అనంతరం, ఈ సినిమాకు సంబంధించి కీలకమైన ట్రైన్ ఎపిసోడ్ ని ఇటీవల సక్సెస్ ఫుల్ గా చిత్రీకరించినట్లు దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపిన విషయం తెలిసిందే. 

ఇక ఈ సినిమాలో ఇప్పటికే లేడీ అమితాబ్ గా పేరుగాంచిన లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఒక కీలక పాత్రలో నటిస్తుండగా, ఇతర పాత్రల్లో రాజేంద్ర ప్రసాద్, మురళి శర్మ, రావు రమేష్, తదితరులు నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో నటుడు, నిర్మాత అయిన బండ్ల గణేష్ ఒక ఫన్నీ క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి, అలానే ఆయన కూడా ఒక ఇంటర్వ్యూ లో మహేష్, అనిల్ రావిపూడిల సినిమాలో నటిస్తున్నట్లు చెప్పారు. ఇకపోతే ఈ సినిమాలో బండ్ల గణేష్ నటించే క్యారెక్టర్ షూటింగ్ నేటి నుండి మొదలెట్టామని సరిలేరు నీకెవ్వరు యూనిట్ నుండి కాసేపటి క్రితం ఒక ప్రకటన వచ్చింది. 

గతంలో పలు సినిమాల్లో తన కామెడీ డైలాగ్స్ తో ఆకట్టుకున్న బండ్ల, చాలా గ్యాప్ తరువాత నటిస్తున్న ఈ సినిమాలో ఎటువంటి ఫన్నీ పాత్రలో నటిస్తున్నారో చూడాలని ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక మరొక నాలుగు రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినం రాబోతుండడంతో ఆ రోజున ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది....!!   


మరింత సమాచారం తెలుసుకోండి: