సాధారణంగా ఒక సినిమా హిట్ అయితే..వెంటనే ఆ చిత్ర బృందాన్ని ప్రశంసలతో ముంచెత్తుంది చిత్ర పరిశ్రమ.  కానీ కొంత మంది మాత్రం తమ అభిప్రాయాలు చెప్పకుండా సైలెంట్ గా ఉంటారు. దాంతో సోషల్ మీడియాలో ఈ విషయంపై రక రకాల కథనాలు వస్తూనే ఉంటాయి. ఇటీవల విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన ‘దొరసాని’ సినిమా కు సంబంధించిన టీజర్ రిలీజ్ చేసినపుడు, పోస్టర్ రిలీజ్ చేసినపుడు స్టార్ హోదాలో ఉన్న విజయ్ దేవకొండ ఏమాత్రం స్పందించలేదు. 

దాంతో తన తమ్ముడి మూవీపై విజయ్ దేవరకొండ ఎలాంటి స్పందనలు ఇవ్వడం లేదని పెద్ద ఇష్యూ చేశారు. కాకపోతే ఈ విషయంపై ‘దొరసాని’ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు విజయ్ దేవరకొండ స్పందించారు..తన తమ్ముడు అని ప్రమోషన్ చేసి గొప్పగా పొగిడితే..అతని టాలెంట్ ఎవరికీ తెలియకుండా పోతుందని, అందుకే ఆ విషయంలో తాను సైలెంట్ గా ఉన్నానని క్లారిటీ ఇచ్చాడు. ఈ మద్య పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపిస్తుంది. 

చాలా కాలం తర్వాత దర్శకుడిగా పూరి, హీరోగా రామ్ మంచి హిట్ అందుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. అంతే కాదు ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు ఈ సినిమాను ప్రశంసించారు. అయితే పూరితో పోకిరి, బిజినెస్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందుకున్న సూపర్ స్టార్ మహేష్ మాత్రం సినిమా పై తన అభిప్రాయాన్ని తెలపలేదు. 

ఈ విషయంపై ఇప్పటికే రక రకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో రామ్ తో మహేష్ బాబు తీరిగ్గా ముచ్చట పెడుతున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  ఇస్మార్ట్ గెటప్‌లో ఉన్న రామ్‌, మహేష్‌ మధ్య సమావేశం ఏ సందర్భంగా అయ్యింది..రామ్, మహేష్ దేని గురించి మాట్లాడుకున్నారో మాత్రం బయటకు రాలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: