మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి , మాధవన్ హీరోలుగా నటించిన విక్రమ్ వేద కోలీవుడ్ లో బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.  గాయత్రి , పుష్కర్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ చిత్రం లో వర లక్ష్మి శరత్ కుమార్ , శ్రద్ద శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. 11 కోట్ల తో తెరకెక్కిన ఈ చిత్రం 50కోట్ల వసూళ్లను రాబట్టింది.  ఈసినిమా కమర్షియల్ సక్సెస్ మాత్రమే కాకుండా విమర్శకుల చే ప్రశంసలు పొందింది. 


ఇక ఈ చిత్రం బాలీవుడ్ లో రీమేక్ కానుంది. స్టార్ హీరోలు  అమీర్ ఖాన్ , సైఫ్ అలీ ఖాన్ ఈ రీమేక్ లో హీరోలుగా నటించనున్నారు. విజయ్ సేతుపతి పాత్రలో అమీర్ ఖాన్ నటించనుండగా మాధవన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నాడు. త్వరలోనే ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి. ఇక ఈ చిత్రాన్ని తెలుగులో కూడా రీమేక్ చేయడానికి గత కొంత కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఏ హీరో కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు.అయితే ఇటీవల విక్టరీ వెంకటేష్ , రాజశేఖర్ తో ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోవడంతో అవి రూమర్లు గానే మిగిలిపోయాయి.


ఇక బాలీవుడ్ లో ప్రస్తుతం సౌత్ సినిమాల రీమేక్ ట్రెండ్ నడుస్తుంది.అందులో భాగంగా  తమిళం లో విజయం సాధించిన కాంచన , కత్తి సినిమాలను ప్రస్తుతం అక్కడ రీమేక్ చేస్తుండగా తెలుగులో అర్జున్ రెడ్డి ని ఇటీవల అక్కడ రీమేక్ చేయగా  బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.  వీటితో పాటు జెర్సీ , డియర్ కామ్రేడ్ సినిమాలు కూడా త్వరలోనే రీమేక్ కానున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: