అర్జున్  సురవరం సినిమా ను ఏ ముహూర్తాన  మొదలు పెట్టాడో గాని నిఖిల్  సినిమాను థియేటర్లలోకి తీసుకరాలేకపోతున్నాడు.  షూటింగ్ సమయంలో ఎలాంటి  ఇబ్బందులు లేకున్నా ఆ తరువాత టైటిల్  వివాదమైంది. దాంతో టైటిల్ ను మార్చారు. ఇక  సినిమాను సోలోగా  థియేటర్లలోకి  తీసుకరావాలనుకున్నారు.  కాని సరైన విడుదల తేదీ దొరకలేదు.  దాంతో  పలు సార్లు విడుదల తేది ని ప్రకటించి వాయిదావేశారు .  ఇక ఎట్టకేలకు మే నెలలో   ఈ చిత్రాన్ని  విడుదల చేయనున్నామని  ప్రకటించారు.  అయితే మహర్షి , అవెంజర్స్ వంటి భారీ సినిమాలు విడుదలకావడం తో  ఈ చిత్రాన్ని విడుదల చేయలేకపోయారు. 


అయితే ఆ తరువాత  త్వరలోనే  కొత్త విడుదల తేదీ ని ప్రకటిస్తామని  సినిమా యూనిట్ సైలెంట్ అయిపోయారు . దాంతో ఈ సినిమా ఇక  విడుదల కావడం కష్టమేనని వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమా విడుదలకు అన్ని అండ్డంకులు తొలిగిపోయినట్టు గానే కనిపిస్తుంది. సెప్టెంబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  ఇక తాజాగా నిఖిల్ సోషల్ మీడియా లో వెయిట్ ఈజ్ ఓవర్ అని పోస్ట్ చేశాడు. దాంతో ఈ సినిమా రిలీజ్ డేట్ ను త్వరలోనే ప్రకటించనున్నారని తెలుస్తుంది. 


టి యెన్ సంతోష్  డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ  'కనితన్' కి  రీమేక్ గా తెరకెక్కింది. ఈ చిత్రంలో  నిఖిల్ కు జోడిగా లావణ్య త్రిపాఠి నటించగా  రాజ్ కుమార్ ఆకేళ్ల , కావ్య వేణుగోపాల్  సంయుక్తంగా  నిర్మించారు. సామ్ సి ఎస్ సంగీతం అందించాడు.   ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ సినిమాస్ ఈ సినిమా విడుదల హక్కులను సొంతం చేసుకుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: