అర్జున్ సురవరం సినిమా ను ఏ ముహూర్తాన మొదలు పెట్టాడో గాని నిఖిల్ సినిమాను థియేటర్లలోకి తీసుకరాలేకపోతున్నాడు. షూటింగ్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకున్నా ఆ తరువాత టైటిల్ వివాదమైంది. దాంతో టైటిల్ ను మార్చారు. ఇక సినిమాను సోలోగా థియేటర్లలోకి తీసుకరావాలనుకున్నారు. కాని సరైన విడుదల తేదీ దొరకలేదు. దాంతో పలు సార్లు విడుదల తేది ని ప్రకటించి వాయిదావేశారు . ఇక ఎట్టకేలకు మే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నామని ప్రకటించారు. అయితే మహర్షి , అవెంజర్స్ వంటి భారీ సినిమాలు విడుదలకావడం తో ఈ చిత్రాన్ని విడుదల చేయలేకపోయారు.
అయితే ఆ తరువాత త్వరలోనే కొత్త విడుదల తేదీ ని ప్రకటిస్తామని సినిమా యూనిట్ సైలెంట్ అయిపోయారు . దాంతో ఈ సినిమా ఇక విడుదల కావడం కష్టమేనని వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమా విడుదలకు అన్ని అండ్డంకులు తొలిగిపోయినట్టు గానే కనిపిస్తుంది. సెప్టెంబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక తాజాగా నిఖిల్ సోషల్ మీడియా లో వెయిట్ ఈజ్ ఓవర్ అని పోస్ట్ చేశాడు. దాంతో ఈ సినిమా రిలీజ్ డేట్ ను త్వరలోనే ప్రకటించనున్నారని తెలుస్తుంది.
టి యెన్ సంతోష్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'కనితన్' కి రీమేక్ గా తెరకెక్కింది. ఈ చిత్రంలో నిఖిల్ కు జోడిగా లావణ్య త్రిపాఠి నటించగా రాజ్ కుమార్ ఆకేళ్ల , కావ్య వేణుగోపాల్ సంయుక్తంగా నిర్మించారు. సామ్ సి ఎస్ సంగీతం అందించాడు. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ సినిమాస్ ఈ సినిమా విడుదల హక్కులను సొంతం చేసుకుంది.