ఇక హీరోగా ఎక్కువ మంది ముక్త కంఠంతో బాబా భాస్కర్ను ఎంచుకున్నారు.చిన్న విషయానికి కూడా నోటికొచ్చినట్లు తిట్ల పురాణాన్ని ప్రారంభించే తమన్నాను నోటి దురుసును తగ్గించుకోవాలంటూ నాగ్ చెప్పారు.వారం మొత్తం టాస్క్లు ఇచ్చిన బిగ్బాస్ వారాంతంలో వాటికి విరామాన్ని ఇచ్చాడు. ఆదివారం స్నేహితుల దినోత్సవం కావటంతో గిల్లికజ్జాలు పక్కనపెట్టి అందరూ ఉత్సాహంగా ఉన్నారు.స్నేహితుల దినోత్సవం సందర్భంగా బిగ్ బాస్ హౌస్ లోకి ఫ్రెండ్షిప్ బ్యాండ్ పంపించి ఇంటి సభ్యులకు మీకు ఇష్టమొచ్చిన జిగిడి దోస్తులకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టి దానికి కారణాలను చెప్పమన్నారు.
అలానే ఇంటి సభ్యులందరూ ఒక్కొక్కరిగా వారి బెస్ట్ఫ్రెండ్కు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడుతూ ఎందుకు ఇష్టమో వివరిస్తూ తర్వాత వారితో కలిసి పాటలకు స్టెప్పులేశారు .ఇలా ఆనందిస్తుండగా వారికి బిగ్ బాస్ ఒక సర్ప్రైజ్ను ఇస్తూ హౌస్లోకి ఇస్మార్ట్ శంకర్ టీమ్ ఎంట్రీ ఇచ్చింది. ఎనర్జిటిక్ హీరో రామ్, హీరోయిన్ నిధి అగర్వాల్ లు సందడి చేస్తూ ఇంటి సభ్యులతోపాటు ప్రేక్షకులను అలరించారు. ఇది ఇలా ఉండగా ఎలిమినేషన్ సమయం వచ్చేసింది. రెండవవారం ఎలిమినేషన్లో 8 మంది ఇంటి సభ్యులుండగా మహేష్, హిమజ, రాహుల్, శ్రీముఖిలు సేఫ్ జోన్లో ఉన్నట్లు నాగ్ ప్రకటించారు.
హౌస్లోని కుటుంబ సభ్యుల్లో ఎక్కువ మంది జాఫర్ను సేఫ్ చేయాలని చూశారు. కాని ప్రేక్షకుల ఓట్ల ప్రకారంగా జాఫర్ను ఇంటి నుంచి పంపించేయాల్సొచింది. దీంతో శ్రీముఖి, బాబా భాస్కర్, మహేశ్లు కన్నీరు పెట్టుకున్నారు.శ్రీముఖిని ఓదార్చటం హౌస్లో ఎవరివల్లా కాలేదు.హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన జాఫర్ స్టేజ్ మీద నాగార్జునతో మాట్లాడుతూ "బిగ్ బాస్లో జరిగేదంతా స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుందని పొరపడ్డానని, అందుకు క్షమించమని కోరారు.
అనంతరం జాఫర్ బిగ్బాస్ ఇంట్లో గడిపిన రెండువారాల జర్నీని వీడియో చూపించారు. బయటికి వెళ్లేముందు ఇంటి సభ్యులతో జాఫర్ ముఖాముఖి జరిపుతూ మీతోపాటు బయటికి ఎవరిని తీసుకెళ్లాలనుకుంటున్నారు అని నాగ్ ప్రశ్నించగా తనకెంతో ఇష్టమైన వరుణ్ను వెంటబెట్టుకుని వెళ్తానని చెప్పి బిగ్బాస్ హౌస్ లో నుంచి వెలిపోయారు. సండే అయిపోయింది.ఇప్పటివరకు ఇంటి నుంచి ఇద్దరు సభ్యులు ఎలిమినేట్ అయ్యారు.గండం గట్టెక్కింది అనుకుంటున్న కుటుంబ సభ్యుల్లో సోమవారం ఎవరు నామినేట్ కానున్నారో వేచిచూడాలి.