కమెడియన్... పరమేశ్వర ఆర్ట్స్ నిర్మాత బండ్ల గణేష్ గత కొంతకాలంగా కంప్లీట్‌గా సినిమాలకు అన్నీ రకాలుగా దూరంగా ఉంటున్నాడు. మళ్ళీ చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద కనిపించబోతున్నాడు. అది ఓ భారీ ప్రాజెక్ట్ లో. పవస్టార్ పవన్ కళ్యాణ్ తో తీసిన గబ్బర్ సింగ్ సినిమాతో ఇండస్ట్రీలో నిర్మాతగా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత కూడా తీసిన వన్నీ పెద్ద స్టార్ హీరోలు, పెద్ద డైరెక్టర్స్ తోనే. ఇక కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ గణేష్ నటుడిగా, నిర్మాతగా కొనసాగాలనుకుంటున్నాడు. అందుకే రెమ్యునిరేషన్ కూడా భారీగానే డిమాండ్ చేస్తున్నాడని లేటెస్ట్ న్యూస్.

సోషల్ మీడియాలో గణేష్ కున్న పాపులారటీతో ప్రస్తుతం తనకి వస్తున్న సినిమా అవకాశాలకు రోజుకు అయిదు లక్షలు ఇస్తేనే చేస్తానని చెప్పాడట. అయితే ఈ విషయాన్ని నేరుగా చెప్పకుండా, తనకు ఫారన్ ట్రిప్ వుందని, బిజినెస్ వ్యవహారాలలో బిజీగా ఉన్నాను..చేయనని ఇలా సాకులు చెప్పి, సాగదీసి, ఆఖరికి తను గట్టిగా అనుకున్న రెమ్యూనిరేషన్ తీసుకున్నట్లు తాజా సమాచారం. అంతకు ముందు బండ్ల మళ్లీ నటించాలనుకున్న విషయం పసిగట్టిన దర్శకుడు మారుతి కూడా తన లేటెస్ట్ సినిమా 'ప్రతిరోజు పండుగే'లో ఓ కీలకపాత్రకు అడిగాడట. అక్కడ కూడా రోజుకు అయిదు లక్షలు కావాలని డిమాండ్ చేయడంతో మారుతి మాట మాట్లాడకుండా, అజయ్ ను తీసేసుకున్నాడని వార్తలు వచ్చాయి. ఇందులో నిజమెంతో తెలీదుగాని మారుతి సినిమాలో మాత్రం అజయ్ నటిస్తున్న మాట మాత్రం వాస్తవం. 
 
అయితే అనిల్ రావిపూడి మాత్రం తనకు బండ్లగణేష్ నే కావాలని నిర్మాతను ఒప్పించినట్లు తెలుస్తోంది. కేవలం 7 రోజులు మాత్రమే కాబట్టి 35 లక్షల రెమ్యూనిరేషన్ తో సరిపోయింది. అయితే ఇప్పటివరకు కమెడియన్లలో ఎక్కువ రెమ్యునిరేషన్ తీసుకుంది సునీల్, బ్రహ్మానందం మాత్రమే. ఇప్పుడు ఆ లైన్ లో బండ్ల కూడా చేరాడని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారట. ఆగస్ట్ 5 వ తేదీ నుంచి సెట్ మీదకు వెళ్తున్నాడు బండ్ల గణేష్. ఈ సినిమాలో వచ్చే కీలకమైన ట్రేయిన్ ఎపిసోడ్ లో గణేష్ పాత్ర ఎంటర్ అవుతుందట. అప్పటికి అదే ట్రయిన్ లో, హీరో, హీరోయిన్, రావురమేష్, ఇలా చాలామంది నటులు వుంటారట. వారితో బండ్ల కూడా జాయిన్ అయి కామెడీ చేస్తాడని తెలుస్తోంది. ఇక సినిమా కూడా ప్లాన్ చేస్తున్నటు ఇన్‌సైడ్ టాక్ బాగానే నడుస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: