పూరి లేక లేక ఓ భారీ హిట్ కొట్టాడు. దాంతో ప్రమోషన్స్ భారీగా నిర్వహిస్తున్నారు. సినిమా రిలీజ్ కంటే సక్సస్ అన్న మాట విన్న తర్వాత పూరి టీమ్ సక్సస్ టూర్స్ పేరుతో చేస్తున్న హంగామా మామూలుగా లేదు. వాస్తవంగా నభా నటేష్.. ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ కు ముందు ప్రమోషన్లు అన్నింటా ఆమెదే హవా. ప్రీరిలీజ్ లోనూ, ఆఫ్టర్ రిలీజ్ లోనూ కూడా ఆమె చేసిన హడావుడి ఇంతా అంతా కాదు. అదే సినిమాలో మరో హీరోయిన్ నిధి అగర్వాల్ మొదట్లో అస్సలు కనిపించలేదు. అందుకే నిధి అగర్వాల్ ఇస్మార్ట్ క్రెడిట్ లో భాగం కోసం తనే ప్రెస్ మీట్ కూడా పెట్టబోయింది. 

అలాంటిది ఉన్నట్లుండి నభా నటేష్ చటుక్కున మాయం అయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇస్మార్ట్ టీమ్ తో నిథి అగర్వాలే కనిపిస్తోంది. నభాకు ఏమయింది? పక్కన పెట్టారా? లేక ఆమె తప్పుకుందా? అన్నది ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. అయితే ఇలా ఉన్నట్టుండి మాయం కావడానికి కారణం నభా నటేష్ తీవ్రంగా జ్వరంతో బాధ పడుతుందని తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్ విజయోత్సవాలలో భాగంగా లేట్ నైట్ పార్టీలు బాగా ఎంజాయ్ చేశారు. ఓ పార్టీలో అయితే డైరక్టర్ ఆర్జీవీ చేసిన హంగామా ఇంతా అంతా కాదు. షాంపేన్ బాటిల్ ఓపెన్ చేసి అందరి తలలపై పోసి రచ్చ రచ్చ చేసాడు. పనిలో పనిగా ఆయన కూడా షాంపేన్ లో స్నానం చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పటికి తెగ తిరిగేస్తోంది.

అయితే ఆ సక్సస్ సెలబ్రేషన్స్ తర్వాతే నభా తీవ్రంగా జ్వరం వచ్చి, బెంగళూరు వెళ్లిపోయిందట. అప్పటి నుంచి ఇప్పటికీ ఇంకా కోలుకోలేదని సమాచారం. ఇదిలా ఉంటే మరో కొన్ని రోజుల్లో రవితేజ డిస్కోరాజా షూటింగ్ కు వెళ్లాల్సి వుంది నభా నటేష్. మరి ఇస్మార్ట్ జ్వరం తగ్గి రవితేజ తో సెట్స్ మీదకు వస్తుందో లేదో చూడాలి. పాపం నభా ఆర్జీవి కి భయపడిందేమోనని ఓవైపు సరదా సెటైర్లు పడుతున్నాయి.  ఇక రీసెంట్‌గా ఫారిన్ ట్రిప్ ఫినిష్ చేసుకొచ్చిన రామ్ ఇస్మార్ట్ సక్సస్ టూర్ లో పాల్గొంటున్నాడు. నిజంగా ఈ సక్సస్ మాత్రం రామ్ కి చాలా స్పెషల్ అని చెప్పాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: