బిగ్ బాస్ సీజన్ 3 కింగ్ నాగార్జున హోస్ట్ గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 15 మంది కంటెస్టంట్స్ తో మొదలైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో రెండు వారాల్లో ఇద్దరు వ్యక్తులు వెళ్లారు. అయితే మొదటివారం హేమ ఎలిమినేట్ అవగానే తమన్నా సింహాద్రిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ చేశారు బిగ్ బాస్. అయితే నిన్న ఆదివారం టివి 9 జాఫర్ ఎలిమినేట్ అయ్యాడు.


ఈ సీజన్ లో బుల్లితెర నుండి చాలామంది సెలబ్రిటీస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. సీరియల్స్ లో నటిస్తున్న రవి కృష్ణ, ఆలి రెజాతో పాటుగా యాంకర్ గా అదరగొడుతున్న శ్రీముఖి, శివ జ్యోతి ఉన్నారు. సీరియల్స్ తో పాటుగా సినిమాల్లో నటిస్తున్న హిమజ.. బుల్లితెర భామ రోహిణి కూడా హౌజ్ లో ఎనర్జిటిక్ గా కనిపిస్తుంది.


అందరిలో స్మాల్ స్క్రీన్ పై సత్తా చాటుతున్న శ్రీముఖికి బయట క్రేజ్ ఎక్కువ. అయితే మొదటి వారం నామినేషన్ లో లేదు కాని సెకండ్ వీక్ లో శ్రీముఖి నామినేషన్ ఉంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో జరిగిన నామినేషన్స్ లో కూడా శ్రీముఖిని నామినేట్ చేశారు. కాని హయ్యెస్ట్ ప్రియారిటీ లేకపోవడం వల్ల కేవలం రాహుల్, వితిక, తమన్నా, పునర్నవి లను మాత్రమే బిగ్ బాస్ నామినేషన్ లో ఉన్నారు.


అయితే శ్రీముఖిని త్వరగా బయటకు పంపిస్తే షోకి దెబ్బ పడుతుందని భావిస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. బిగ్ బాస్ లో ఉన్న అందరికన్నా శ్రీముఖికే ఎక్కువ రెమ్యునరేషన్ అని తెలుస్తుంది. రోజుకి ఆమెకు 3.5 లక్షల దాకా వస్తుందని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 3 ఒకవేళ శ్రీముఖి 100 రోజుకు ఉంటే రెమ్యునరేషన్ గానే మూడున్నర కోట్ల దాకా అందుకునే ఛాన్స్ ఉంది. శ్రీముఖి క్రేజ్ షోకి హెల్ప్ అవుతుంది కాబట్టి ఆమెను హౌజ్ నుండి ఇప్పుడప్పుడే బయటకు పంపించరని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: