తమిళ స్టార్ హీరో సూర్య  తమిళ్ తోపాటూ తెలుగులోనూ  అభిమానులను సంపాదించుకున్నారు.  గజినీ తో తెలుగు కు ప్రేక్షకులకు దగ్గరైన  సూర్య ఆ తరువాత సింగం సిరీస్ తో ఒక వర్గానికే  పరిమితం కాకుండా సాలిడ్ ఫ్యాన్ బేస్ ను ఏర్పరచుకున్నారు. సింగం సిరీస్ లో వచ్చిన సినిమాలు  మంచి వసూళ్లను సాధించడంతో  ఆయన మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. 



అయితే గత కొంతకాలంగా సూర్య  సినిమాలు వరుసగా  బోల్తా కొట్టడంతో సీన్  రివర్స్ అయ్యింది.  ఇటీవల విడుదలైన యెన్ జి కె అయితే భారీ నష్టాలను మిగిల్చింది. దాంతో ఇప్పుడు సూర్య నటించిన తాజా చిత్రం బందోబస్త్ ను కొనడానికి  తెలుగులో బయ్యర్లు  ముందుకు రావడం లేదట. గతంలో మాదిరి కాకుండా  తక్కువ ధరకే  సినిమాను అమ్ముతామన్న ఎందుకో బయ్యర్లు  వెనుకడువేస్తున్నారట. దాంతో చిత్రాన్ని నిర్మించిన లైకా ప్రొడక్షన్స్  తెలుగులో విడుదలచేయడానికి  రెడీ అవుతుందట.  అయితే కోలీవుడ్ లో సూర్య కు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ వుండడంతో  యెన్ జి కె ఎఫెక్ట్ ఈసినిమా ఫై పెద్దగా పడలేదు. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరుగుతుందట. 



అయితే ఇటీవల విడుదలైన ఈచిత్రం యొక్క  ట్రైలర్ సినిమా ఫై అంచనాలు పెంచింది. మరి ఈ సినిమా  తో సూర్య   సూపర్ హిట్ కొట్టి స్ట్రాంగ్ గా కమ్ బ్యాక్ అవుతాడో లేదో చూడాలి.  రంగం ఫేమ్  కెవి ఆనంద్ తెరకెక్కిస్తున్న  ఈ చిత్రంలో మోహన్ లాల్ , ఆర్య , బోమన్ ఇరానీ  ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా రానున్న ఈ చిత్రంలో  సయేశా సైగల్ కథానాయికగా నటిస్తుంది . ఈచిత్రంలో సూర్య యెన్ జి కె  కమాండర్ గా డిఫ్రెంట్ అవతారాల్లో కనిపించనున్నాడు.   సెప్టెంబర్ 20న ఈచిత్రం  విడుదలకానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: