కేవలం నాలుగేళ్ల కాలంలో మైత్రి మూవీస్ సంస్థ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ ల లిస్ట్ లో మొదటి స్థానంలో నిలవడమే కాకుండా టాప్ హీరోలు అందరితోను సినిమాలు తీసిన ట్రాక్ రికార్డ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఇండస్ట్రీ టాప్ హీరోలు అందరికీ కథ ఫైనల్ కాకుండానే భారీ మొత్తాలలో అడ్వాన్స్ లు ఇచ్చి అందరి హీరోలను తన గ్రిప్ లో పెట్టుకోవడంలో మైత్రి మూవీస్ సంస్థ చూపిస్తున్న తెగువ ప్రస్తుతం ఇండస్ట్రీలో మరే నిర్మాత చూపించ లేకపోతున్నాడు. 

ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం మైత్రి మూవీస్ సంస్థ ఊహించని కష్టాలు ఎదుర్కుంటోంది అంటూ వార్తలు హడావిడి చేస్తున్నాయి. దీనికికారణం గతఏడాది సెకండ్ హాఫ్ లో వచ్చిన ‘సవ్యసాచి’ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ మూవీలు ఘోరమైన ఫ్లాప్ లుగా మారడంతో ఈసంస్థకు భారీనష్టాలు వచ్చాయి అన్నప్రచారం జరుగుతోంది. దీనికితోడు లేటెస్ట్ గా విడుదలైన ‘డియర్ కామ్రేడ్’ మూవీ కూడ ఫ్లాప్ గా మారడంతో ఈప్రొడక్షన్ హౌస్ సక్సస్ ట్రాక్ పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. 

ఇదిచాలదు అన్నట్లుగా మైత్రిమూవీస్ సంస్థ భాగస్వాముల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి అనివస్తున్న వార్తలు కూడ ఈసంస్థ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉంది. ప్రస్తుతం ఈమూవీ నిర్మాతలు తాము తీసే సినిమాల హీరోల కాంబినేషన్ గురించి ఆలోచిస్తున్నారు కాని కథల విషయంలో శ్రద్ధ పెట్టడంలేదు అన్నకామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో త్వరలో విడుదలకాబోతున్న నాని ‘గ్యాంగ్ లీడర్’ మైత్రీ మూవీస్ ప్రొడక్షన్ హౌస్ భవిష్యత్ కు అత్యంత కీలకంగా మారింది అన్నవార్తలు వస్తున్నాయి. 

ఈమూవీ కూడ ఫ్లాప్ అయితే ఈసంస్థ పరపతి మరింత దెబ్బ తినే అవకాసం ఉన్న నేపధ్యంలో నాని పై ఎక్కువ బాధ్యత పడింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన సినిమాలు ఫ్లాప్ ట్రాక్ లో కొనసాగుతున్న పరిస్థితులలో అటు దర్శకుడి కోసం ఇటు మైత్రీ మూవీస్ నిర్మాణ సంస్థ కోసం నాని ‘గ్యాంగ్ లీడర్’ లో చాల కష్టపడవలసి వస్తోంది అంటూ కొందరు చేస్తున్న కామెంట్స్ వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి..    



మరింత సమాచారం తెలుసుకోండి: