గతంలో ఒకప్రముఖ ఛానల్ లో సినిమా రివ్యూలు చెప్పే కత్తి మహేష్ ఈమధ్య కొంతవరకు సైలెంట్ అయ్యాడు. శ్రీరాముడు పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తెలంగాణ నుండి బహిష్కరణకు గురైన కత్తి మహేష్ నెమ్మదిగా ఆవివాదాల నుండి బయటకు వచ్చి తిరిగి తన సహజసిద్ధమైన మాటల సెటైర్లను ప్రయోగిస్తున్నాడు. 

ఇలాంటి పరిస్థితులలో కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ చేసిన వివాదాస్పద ట్విట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ‘జనసేన’ ఘోర పరాజయం తరువాత పవన్ ప్రస్తుతం గోదావరి జిల్లాలలో పర్యటన చేస్తూ అక్కడి జనసైనికులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. 

పరాజయాలకు భయపడితే తాను ‘గబ్బర్ సింగ్’ సినిమాలో నటించి తిరిగి సక్సస్ ట్రాక్ లోకి రాగలిగే వాడినా అని చెపుతూ తాను జీవించి ఉన్నంత కాలం ‘జనసేన’ పార్టీని ఏపార్టీలోను విలీనం చేయనని ప్రకటించాడు. ఈవిషయాన్ని ఆధారంగా చేసుకుని కత్తి మహేష్ ఒక వివాదాస్పద ట్విట్ చేసాడు. ‘‘జనసేన పార్టీని ఏ పార్టీలోనూ విలీనం చేయం- పవన్ కళ్యాణ్... నిజమే... విలీనం చేస్తే వన్ టైం సెటిల్ మెంట్ అయిపోతుంది. ఇలాగే ఉంటే అవసరానికి తగ్గట్టు ప్యాకేజీలు వస్తూనే ఉంటాయి'' అంటూ కత్తి మహేష్ సంచలన కామెంట్స్ చేసాడు.

ఇప్పుడు ఈ కామెంట్స్ పవన్ అభిమానుల దృష్టి వరకు వెళ్ళడంతో వారంతా కత్తి మహేష్ పై తీవ్ర అసహనంలో ఉన్నారు. అంతేకాదు మళ్ళీ పవన్ ను టార్గెట్ చేస్తూ కత్తి మహేష్ చేస్తున్న కామెంట్స్ వెనుక ఎవరి హస్తం ఉంది అంటూ సందేహాలు కూడ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి విమర్శలను పట్టించుకోని పవన్ ప్రస్తుతం గోదావరి జిల్లాలలో చేస్తున్న పర్యటనకు వస్తున్న అపూర్వ స్పందన చూసిన వారికి అసలు పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎందుకు ఓడిపోయాడు అన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: