టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పురి జగన్నాథ్ సినిమాలు ఎలా ఉంటాయో ఆయన మాట తీరు కూడా అంతే ఉంటుంది. హీరో సెంట్రిక్ సినిమాలు తనదైన శైలిలో తీసే పూరి జగన్నాథ్ తాజా గా ఇస్మార్ట్ శంకర్ తో మంచి విజయం సాధించాడు. పూరి పనైపోయిందన్న వాళ్లకి ఇస్మార్ట్ శంకర్ తో తానేంటో చూపించాడు.టెంపర్ తర్వాత మళ్ళీ విజయాన్ని చూసాడు పూరి. అయితే ఈ సక్సెస్ లో తాను ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ తీయలనే ఆలోచన కూడా ఉందని చెప్పాడు.
ఇస్మార్ట్ శంకర్ సినిమా పాయింట్ చాలా చిన్నది. కానీ ఆ చిన్న పాయింట్ చాలా చక్కగా చూపించాడు. ముఖ్యంగా ఈ సినిమాలో అందరికీ నచ్చిన విషయం ఏంటంటే హీరో రామ్. అవును అప్పటి వరకు గుడ్ బాయ్ పాత్రలే చేసిన రామ్ ఈ సినిమాలో ఇంత మాస్ గా కనిపిస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. రామ్ లుక్ పూర్తిగా మారిపోయింది. పూరి జగన్నాథ్ ప్రతీ సినిమాలో హీరో ఇలా మారడం సాధారణ విషయమే.
ఇస్మార్ట్ శంకర్ విడుదలైన వెంటనే వర్మ స్పందిస్తూ రామ్ మరియు పూరిల నుండి వెంటనే దీనికి సీక్వెల్ చూడాలని ఉందంటూ ట్వీట్ చేశాడు. అందుకు పూరి స్పందిస్తూ తప్పకుండా సార్ త్వరలోనే డబుల్ ఇస్మార్ట్ శంకర్ను మొదలు పెడతాను. అందుకు సంబంధించిన ఏర్పాట్లు మొదలు పెట్టినట్లుగా ప్రకటించాడు. మొదటి నుండి ఇస్మార్ట్ శంకర్ మీద గట్టి నమ్మకంతో ఉన్నాడు.
అయితే ఈ డబుల్ ఇస్మార్ట్ లో హీరోగా ఎవరు చేస్తారనేది మాత్రం చెప్పలేదు తాజాగా ఈ సీక్వెల్ విషయమై అడిగితే ప్రస్తుతానికి ఇస్మార్ట్ సీక్వెల్ లేదని తేల్చి చెప్పాడు. భవిష్యత్తులో ఏమైనా ప్లాన్ చేస్తానేమో తెలియదు అంటూ చెప్పుకొచ్చాడు. పూరి మాట తీరును చూస్తుంటే ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.