టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాల్లో నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేష్ అంటే ఆ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోతున్నాయి. బన్ని అంటేనే డ్యాన్స్ కి కేరాఫ్ అడ్రస్ అంటారు..అలాంటిది ఆయన సినిమాలో ప్రత్యేకంగా ఓ ఐటమ్ సాంగ్ ఉండటం గమనిస్తూనే ఉన్నాం.
గతంలో బన్ని నటించిన ప్రతి సినిమాలోనూ అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఉండటం కామన్. బన్ని-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ లో పూజా హెగ్డే, నివేతా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తోన్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాకినాడలో జరుగుతోంది. తాజాగా సినిమాలో ఐటెం సాంగ్ విషయంలో త్రివిక్రమ్, అల్లు అర్జున్ ల మధ్య విబేధాలు వచ్చాయని ఫిల్మ్ నగర్ టాక్.
అయితే ఈ సినిమా ఫాదర్ సెంటిమెంట్ తో నడుస్తుందని.. ఆ ఫ్లో మిస్ అవుతామని అల్లు అర్జున్ భావించిన క్రమంలో ఇందులో ఐటమ్ సాంగ్ పెట్టకపోవడమే మంచిదని అన్నారట. మరోవైపు సినిమాలో ఓ కీలక సందర్భంలో ఐటెం సాంగ్ కచ్చితంగా ఉండాలని త్రివిక్రమ్ అభిప్రాయపడుతున్నారట. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాల్లో ఐటమ్ సాంగ్ లేవు. ఈ కారణంతోనే త్రివిక్రమ్ ఐటమ్ సాంగ్ కి అంతగా ప్రాధాన్యత ఇస్తున్నారట.
సినిమా సెంటిమెంట్ ఎక్కడ దెబ్బతింటుందో అన్న అభిప్రాయంలో అల్లు అర్జున్ ఉన్నట్లు సమాచారం. ఈ విషయంలో ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయనే మాటలు వినిపిస్తున్నాయి. గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తోన్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. సీనియర్ నటి టబు, యంగ్ హీరో సుశాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.