ఎట్టకేలకు పూరి జగన్నాథ్ హిట్ కొట్టాడు. అదీ అలాంటిలాంటి హిట్ కాదు. గతంలోని చేదు జ్ఞాపకాలను మరిపించేలా మాంచి కిక్ ఇచ్చే అతి భారీ హిట్టు. దీంతో ఇక పూరి పురాగమనం ఖాయం అని, పూర్వ వైభవాన్ని ఈ స్టార్ డైరెక్టర్ అనుభవిస్తాడు అని అనుకున్నారు అంతా. నిజానికి సినిమా మొత్తం హీరో రామ్, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ మీదనే నడిచింది అని బయట టాక్. అందుకు తగ్గట్టు సెగలు పుట్టించే ఇద్దరు అందాల భామలు. వీళ్ళను తప్ప పూరి టేకింగ్, కథలోని గొప్పతనం గురించి బయట ఎవరూ మాట్లాడుకోవటం లేదట. మొత్తానికి రామ్ పర్ఫార్మెన్స్, మణిశర్మ మ్యూజిక్ కథలోని నోసుగులని కప్పిపుచ్చేశాయి అనే చెప్పాలి.


ఇంక ఈ సినిమా ఇంత కమర్షియల్ గా హిట్ అయినా ఏ స్టార్ హీరో నుండి ఒక ట్వీట్ కానీ, పోస్ట్ కానీ లేకపోవడం గమనార్హం. ఒక్క రామ్ చరణ్ చాలా లేటుగా స్పందించాడు. ఇక మహేష్ పైన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా పూరీకి పెద్ద నెగటివ్ గా మారాయి. ప్రస్తుతం అతను మరొక చిన్న హీరోతో సినిమా చేయాల్సిందే తప్ప పెద్ద హీరోలు ఎవరూ అతనికి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే లేదు.


మరో వైపు ఎనర్జిటిక్ స్టార్ రామ్ మాత్రం పెద్ద దర్శకుల కంట్లో పడిపోయాడు. హాలిడే నుంచి వచ్చిన రామ్ కోసం పెద్ద ప్రాజెక్టులే లైన్ లో ఉన్నాయని విశ్లేషకుల అంచనా. మణిశర్మ కూడా నాలుగైదు సినిమాలు కమిట్ అయ్యాడని భోగట్టా. అయితే పూరి నుండి ఎలాంటి రెస్పాన్స్ మాత్రం లేదు. ముందు ఇష్మార్ట్ శంకర్ హాంగోవర్ నుండి బయటకు వచ్చి ఈ సినిమా వల్ల తనకు ఒరిగింది ఏమిటని రియాలిటీ లో చూసుకోవాల్సిందిగా సినీ అభిమానులు జగన్ కి సలహాలు ఇస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: