రామ్ ఇప్పటివరకు చేసిన సినిమాలతో  క్లాస్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు. అక్కడక్కడా ఓ మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చినప్పటికి ఆ సినిమాల రేంజ్ మాస్ హీరోకి రావలసినంత క్రేజ్ మాత్రం రాలేదు. కానీ ఇస్మార్ట్ శంకర్ తర్వాత హీరో రామ్ ఇమేజ్ లెక్కలు మారిపోయాయి. తనకు ఊర మాస్ క్యారెక్టర్ సెట్ అవుతుందని పూరి రుజువు చేయడంతో అలాంటి పాత్రలతో వస్తున్న దర్శకుల క్యూ ని చూసి రామ్ ఆశ్చర్యపోతున్నాడట. నిజానికి దీని సక్సెస్ మీద యూనిట్ ముందు నుంచి కాన్ఫిడెంట్ గా ఉన్నప్పటికీ ఈ స్థాయి రెస్పాన్స్ ఊహించలేదన్నది వాస్తవం. అందుకే ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ అని పూరి ప్రకటించాడు. కానీ దానికి చాలానే టైం పట్టేలా ఉంది. 

కారణం ఈ సినిమా కన్నా ముందే కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ స్రవంతి బ్యానర్ లోనే ఓ ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడు. ఇక ఈ సినిమా తమిళ్ హిట్ మూవీ తడంకు రీమేక్ గా తెరకెక్కబోతుందని ఇంతకు ముందే లీకయింది. తమిళంలో అరుణ్ విజయ్ హీరోగా డ్యూయల్ రోల్ చేసిన ఈ సినిమా కోలీవుడ్‌లో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా అరుణ్ మార్కెట్ కి బాగా హెల్ప్ అయ్యింది. అన్నదమ్ముల మధ్య క్రైమ్ డ్రామాని నడిపిన తీరుకు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది . అందుకే రామ్ కు సూట్ అవుతుందని రవి కిషోర్ హక్కులు తీసుకున్నట్టు సమాచారం. అయితే ఇప్పుడు ఈ సినిమా పట్టాలెక్కుతుందా లేదా అనే అనుమానాలు వస్తున్నాయి. 

తడం ఎక్స్ పరిమెంటల్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమాలో ఒక పాత్రకు నెగటివ్ షేడ్స్ కూడా ఉంటాయి. రామ్ కు కొత్తగా వచ్చిన ఇమేజ్ కి ఇలాంటి కథ సెట్ అవుతుందా అనే చర్చలు ప్రస్తుతం జరుగుతున్నాయట. అయితే నేను.. శైలజా వంటి క్యూట్ లవ్ స్టోరీతో రామ్ నెక్స్ట్ సినిమా ఉండబోతుందని చెబుతున్నారు. కానీ వాస్తవానికి తడం చేయాలా వద్దా అనే సంగతి తేలాకే ఫైనల్ డెసిషన్ తీసుకోబోతున్నట్టు లేటెస్ట్ అప్‌డేట్.  


మరింత సమాచారం తెలుసుకోండి: