యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సాహో. ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని యువి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాతలు వంశీ మరియు ప్రమోద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా టీజర్ ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయి, వీక్షకుల నుండి మంచి రెస్పాన్స్ సంపాదించింది. ఇకపోతే ప్రస్తుతం విఎఫ్ఎక్స్ తదితర నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా అధికారిక ట్రైలర్ ని ఈనెల 10వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ చేయనుందట సాహో యూనిట్. 

అయితే ఈ విషయమై ఇప్పటివరకు ఆ సినిమా టీమ్ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రానప్పటికీ, నేడు ఈ న్యూస్ పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. తొలిసారి ప్రభాస్ ఒక డిఫరెంట్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో విలన్స్ గా బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముకేశ్, కోలీవుడ్ నటుడు అరుణ్ విజయ్ లు నటిస్తున్నారు. వారి క్యారెక్టర్ లుక్ ఫోటోలు నిన్న సాహో యూనిట్ అఫీషియల్ గా రిలీజ్ చేయడం జరిగింది. వారి లుక్స్ చూస్తుంటే సినిమా ఎంత గ్రాండియర్ గా లావిష్ గా ఉండనుందో మనకు అర్ధం అవుతుంది. ఇక ట్రైలర్ కూడా ఎంతో ఆకట్టుకుంటుందని, అయితే ట్రైలర్ చూసిన తరువాత, సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో విపరీతంగా పెరుగుతుందని సినిమా యూనిట్ చెప్తోందట. ముఖ్యంగా ట్రైలర్ లో వచ్చే యక్షన్, ఛేజింగ్ సన్నివేశాలు, గ్రాండియర్ లుక్స్, ఫైట్స్ వంటివి సినిమాపై ప్రేక్షకుడికి సినిమాపై అంచనాలు పెంచుతాయట. 

ఇక రేపు తమ సినిమా విడుదల తరువాత తప్పకుండా ఆ అంచనాలను అందుకుని, సూపర్ హిట్ సాధిస్తామని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోందట. ప్రముఖ సంగీత దర్శకుడు జీబ్రాన్ నేపధ్య సంగీతం ఈ సినిమాకు మరొక ప్రధా ఆకర్షణ అని, అలానే ఈ సినిమా కోసం తమ యూనిట్ మొత్తం పడ్డ కష్టం మొత్తం, థియేటర్ కు వచ్చే ప్రేక్షకుడికి తెలుస్తుందని వారు చెపుతున్నారట. మరి ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి...... !!


మరింత సమాచారం తెలుసుకోండి: