టాలీవుడ్ కింగ్ నాగార్జున మన్మథుడుగా ఇంకా రెండు రోజులలో సందడి చేయనున్నాడు. ఆగస్టు 9న మన్మథుడు 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే జోరందుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మన్మథుడు 2 సినిమాకు రూ.24 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. ఈ క్రమంలోనే ఓవర్సీస్లో నాగార్జునకు ఉన్న క్రేజ్ దృష్ట్యా అక్కడ కూడా భారీ ఎత్తున లొకేషన్లలో ఈ సినిమాను రిలీజ్ చేస్తుండడంతో పాటు ప్రమోషన్లు ఓ రేంజ్లో పెంచారు.
మన్మథుడు ఓవర్సీస్ రైట్స్ సొంతం చేసుకున్న యూఎస్ తెలుగు డిస్ట్రిబ్యూటింగ్ సంస్థ 250 పైగా థియేటర్లలో విడుదల చేయనుంది. ఇక ఈ సినిమాకు ఓవర్సీస్లో టిక్కెట్ రేటు ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఆల్ షోలకు, అన్ని రోజుల్లోనూ మన్మథుడు 2 సినిమా టిక్కెట్ రేటు $12గా నిర్ణయించారు. కామెడీ,రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన మన్మథుడు 2 పై భారీ అంచనాలున్నాయి.
దర్శకుడిగా మారిన నటుడు రాహుల్ రవీంద్ర తెరకెక్కించిన ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్,వియాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నాగార్జున సరసన రకుల్ప్రీత్సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. వీరితో పాటు సీనియర్ నటి లక్ష్మి,రావు రమేష్,వెన్నెల కిషోర్,ఝాన్సీ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీకి చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూర్చారు.
ఇక ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు, ట్రైలర్లు చూస్తుంటే నాగ్ ఈ వయస్సులో కూడా కావాల్సినంత రొమాన్స్తో రెచ్చిపోతున్నాడని అర్థమవుతోంది. పెళ్లి కాక ముదురు వయస్సులో ప్రేమిస్తూ ఇబ్బంది పడే ముదురు బ్యాచిలర్గా నాగార్జున కావాల్సినంత వినోదం పండిస్తున్నట్టు తెలుస్తోంది. సినిమాలో కామెడీతో పాటు చివర్లో ఎమోషన్ కూడా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మిక్స్ చేశాడట. సెన్సార్ నుంచి యూ / ఏ రిపోర్టు వచ్చింది. సెన్సార్ బోర్డు నుంచి కూడా సినిమాకు పాజిటివ్ బజ్ వచ్చింది.