సౌత్ ఇండియాలో బిజీ హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు. సినిమా రంగంలోకి అడుగుపెట్టి 12 సంవత్సరాలు దాటినా ఇంకా అవకాశాలు దక్కించుకుంటూ బిజీగా మారింది. ఇటీవల కాలంలో యువ, సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తున్నది. హిట్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నది. ఈ మధ్య కాలంలో బెస్ట్ హిట్ అంటే మెగాస్టార్ తో చేసిన ఖైదీ నెంబర్ 150 అని చెప్పొచ్చు. ఈ సినిమా తరువాత ఆమెకు మరో మంచి హిట్ లేదు. ప్రస్తుతం ఆమె నటించిన రణరంగం, తమిళంలో కోమలి సినిమాలు ఆగస్టు 15 వ తేదీన రిలీజ్ కాబోతున్నాయి.
ఈ రెండింటితో పాటు తమిళంలో క్వీన్ రీమేక్ లో నటించింది. ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యి చాలాకాలం అయ్యింది. రిలీజ్ కు సిద్ధంగా ఉన్నా.. సెన్సార్ ఇప్పటి వరకు పూర్తికాలేదు. బాలీవుడ్ లో సూపర్ హిట్టైన క్వీన్ సినిమాను దక్షిణాది భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో తమన్నా, తమిళంలో కాజల్, కన్నడంలో పరుల్ యాదవ్, మలయాళంలో మంజిమ మోహన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగు, కన్నడ, మలయాళంలో సినిమా సెన్సార్ పూర్తయింది.
తమిళంలో మాత్రం సినిమా ఇప్పటి వరకు సెన్సార్ కాలేదు. నాలుగు సినిమాలను ఒకేసారి రిలీజ్ చేయాలని అనుకున్నారు. తమిళంలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తికాకపోవడానికి కారణాలు ఉన్నాయి. ఈ సినిమా టీజర్ లో కొన్ని సీన్స్ ఉన్నాయి. అందులో కాజల్ అగర్వాల్, మరో ఫారెన్ అమ్మాయి మధ్య ఓ సీన్ ఉన్నది. ఆ సీన్ కారణంగా సినిమా సెన్సార్ కావడం లేదని తెలుస్తోంది. సినిమాలో ఈ సీన్ హైలైట్ అవుతుందని యూనిట్ అంటోంది. ఈ సీన్ అభ్యంతరకరంగా ఉందని సెన్సార్ బోర్డు చెప్తోంది. దీనిపై ఇంకా ఓ క్లారిటీ రాకపోవడంతో సినిమా సెన్సార్ ఆలస్యం అయ్యింది.