బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం హృతిక్ రోషన్, టైగర్ షరఫ్ నటించిన 'వార్' మూవీ రిలీజ్ కాబోతుంది. హృతిక్ తాతయ్య, సీనియర్ దర్శక నిర్మాత జె.ఓం ప్రకాశ్(93) ఈరోజు ఉదయం కన్నుమూశారు.  బాలీవుడ్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. ఈయన చనిపోయిన విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.  బాలీవుడ్ లో `ఆప్ కీ కసమ్`, `అప్‌నా బనాలో` వంటి పలు చిత్రాలను ప్రేక్షకులకు అందించారు.

బుధవారం(ఆగస్టు 7) ఉదయం 8 గంటలకు ముంబైలోని తన నివాసంలో జె ఓం ప్రకాష్ తుది శ్వాస విడిచారు.  రాజేష్ ఖన్నాతో ఆప్ కి కసమ్, జితేంద్రతో అప్నా, ఆద్మీ ఖిలోనా హై లాంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన ఆస్ కా పంచి, ఆయే దిన్ బాహర్ కే లాంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.  1974లో వచ్చిన రాజేష్ ఖన్నా చిత్రం ‘ఆప్ కి కసమ్'  చిత్రంతో ఆయన తన కెరీర్ ప్రారంభించారు.  అప్పటి నుంచి నిర్మాతగా, దర్శకుడిగా బాలీవుడ్ లో ఎన్నో అద్బుతమైన చిత్రాలు అందించారు. 

 ‘ఆప్ కి కసమ్'  చిత్రం అయితే అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయ్యింది..అంతే కాదు ఎవర్ గ్రీన్ మ్యూజికల్ హిట్ గా నిలిచింది.  ఓం ప్రకాష్ కూతురు పింకీ వివాహం బాలీవుడ్ దర్శక, నిర్మాత, నటుడు రాకేష్ రోషన్‌తో జరిగింది. వీరి సంతానమే హృతిక్ రోషన్.  ఇక హృతిక్ రోషన్ చిన్నతనంలో తాతయ్య ఇంట పెరిగాడు..అందుకే ఆయనకు మూవీస్ పై ఎక్కువ మక్కువ కలిగింది..అందుకు అన్ని రకాల శిక్షణ కూడా తీసుకున్నారు హృతిక్ రోషన్. 

ఇటీవల తన తాతయ్యకు లగ్జరీ కారు బహుమతిగా ఇచ్చారు.  ఆయన ఎప్పటి నుంచో కొనాలని అనుకుంటున్న(మెర్సిడెజ్ బెంజ్) కారును బహుమతిగా ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు. ఆయన అంత్యక్రియలు ముంబైలోని పవన్ హన్స్ విల్లే పార్లేలో నిర్వహించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: