లోకనాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం ఓ వైపు రాజకీయాల్లో బిజీ బిజీ గా గడుపుతూ మరోవైపు సినిమాలు కూడా చేస్తూ రెండు విధాలుగా ముందుకు సాగుతున్నారు. అయితే త్వరలో ఆయన శంకర్ దర్శకత్వంలో నటించబోయే భారతీయుడు 2 సినిమా తరువాత, ఇకపై సినిమాల్లో నటించే అవకాశం లేదని సమాచారం. అందుకే తన చివరి సినిమాని అభిమానులకు గుర్తుండిపోయేలా శంకర్ దర్శకత్వంలో చేస్తున్నట్లు చెప్తున్నారు. ఇక ఇటీవల అట్టహాసంగా పూజ కార్యక్రమాలు జరుపుకున్న భారతీయుడు 2 సినిమా షూటింగ్ కొద్దిరోజులు నిర్విరామంగా సాగిందని, 

అయితే మధ్యలో బడ్జెట్ కారణాల వలను సినిమాను అర్దాంతరంగా నిలుపుద చేసినట్లు కొన్నాళ్ల క్రితం వార్తలు వచ్చాయి. అయితే అటువంటిది ఏమి లేదని, కమల్ గారు రాజకీయాల్లో కొంత బిజీ కావడం, అలానే సినిమా కోసం సెట్స్ వేస్తూ ఉండడం వంటి కారణాల వలన సినిమా షూటింగ్ కొంత వాయిదా వేసినట్లు అప్పట్లో దర్శకుడు శంకర్ చెప్పారు. ఇక ఈ సినిమా తాజా షెడ్యూల్ వచ్చే నవంబర్ లో ప్రారంభం అవుతుందని, అనంతరం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, సినిమాను 2021లో తమిళ సంవత్సరాది కానుకగా మార్చి14న రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించినట్లు నేడు పలు కోలీవుడ్ మీడియా మాధ్యమాల్లో వార్తలు విపరీతంగా ప్రచారం అవుతున్నాయి. 

ఇక ఇటీవల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కాజల్ అగర్వాల్ సినిమాలోని తన పాత్ర కోసం 'కలరియపట్టు' అనే విద్యలో శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు రత్నవేలు కెమెరామెన్ గా పని చేస్తున్న ఈ సినిమాకు యువ సంగీత తరంగం అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, విద్యుత్ జమ్‌వాల్, విజయ్ సేతుపతి తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా విడుదల తేదీ విషయమై ప్రస్తుతం ప్రచారం అవుతున్న వార్తలపై యూనిట్ సభ్యుల నుండి అధికారిక ప్రకటన వెలువడవలసి ఉంది....!!


మరింత సమాచారం తెలుసుకోండి: